twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రసిద్ధార్థ 'అందరి బంధువయ' స్టోరీ లైన్

    By Srikanya
    |

    'ఆ నలుగురు' వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని డైరక్ట్ చేసిన చంద్ర సిద్దార్ద తాజాగా 'అందరి బంధువయ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్‌, పద్మప్రియ జంటగా నటించిన ఈ చిత్రం కథ ఏ విధంగా ఉంటుందో ఆయన మీడియాకు వివరించారు.చంద్ర సిద్దార్ధ మాట్లాడుతూ.. నవతరం ఆలోచనలకు దగ్గరగా ఉండే కథ ఇది. కార్పొరేట్‌ సంస్థలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తుంటారు హీరో, హీరోయిన్స్. తాము బ్రతికేదే నాగరిక ప్రపంచం అనుకొంటూ ఏ విలువల్నీ, అనుబంధాల్నీ దూరం చేసుకుంటారు. అయితే కథ కొనసాగుతుండగా..తాము దేన్ని దూరం చేసుకొంటున్నామో తెలుసుకొంటారు. మన మూలాల్ని వెదుక్కొంటూ వాళ్లు చేసిన ప్రయాణం హృదయాన్ని హత్తుకొంటాయన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఆడియోను సైతం విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో నరేష్‌, ఆర్‌.కె., విజయ్‌, కృష్ణభగవాన్‌, ఎమ్మెస్‌ నారాయణ, ఆర్యన్‌ తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: జె.కె.గుమ్మడి, పాటలు: చైతన్యప్రసాద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X