Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవికి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల సెగ..కేవలం కొడుకు సినిమాలేనా!
మెగాస్టార్ చిరంజీవికి పొలిటికల్ సెగ తగిలింది. రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆదివారం చిరంజీవి వైజాగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవికి ప్రత్యేక హోదా సెగ తగిలింది. ప్రత్యేక హోదా కోసం ఏపీ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరు రాకతో ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు ప్లకార్డులతో నిరనస తెలియజేసారు.
చిరు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవికి తన తనయుడు రాంచరణ్ సినిమా ఈవెంట్స్ మినహా ఏపీ సమస్యలు పట్టవా అంటూ ఏయూ యువత ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కాబోతున్న సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఏయూ విద్యార్థులని పోలీస్ లు నిలువరించారు. పాలిటిక్స్ కి బ్రేక్ ఇచ్చిన తరువాత చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో సైరా చిత్రంలో నటిస్తున్నారు.