Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
‘జలక్’ ఇవ్వనున్న రింగరింగ పాప!
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'ఆర్య2" చిత్రంలోని 'రింగ రింగా" ఐటమ్ సాంగ్ లో మెరిసి పోయిన విదేశీ సుందరి ఎరిన్ ఆండ్రియా....ఆ పాట ద్వారా చాలా పాపులారిటీ సంపాదించింది. దేశీ శ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఆ పాట యూత్ ను ఓ ఊపు ఊపితే, ఆ పాటకు తగిన వింధంగా అదిరిపోయే స్టెప్పులేసి సాంగ్ సూపర్ హిట్ కావడానికి తన వంతు ప్రయత్నం చేసిన ఆండ్రియా. ఈ పాటను చూసి ఎంతగానో మెచ్చిన సల్మాన్ఖాన్ తన చిత్రం 'రెడీ"లో కూడా దేవీశ్రీవూపసాద్తో ఈ పాటకు ట్యూన్ చేయించుకున్నాడు. 'ధింక చికా" అంటూ బాలీవుడ్లో ఈ పాట మార్మోగిపోయింది. బాలీవుడ్లో జరిగే ప్రతి సినిమా కార్యక్షికమంలో ఈ పాటకు నర్తించడం తప్పనిసరైపోయింది.
ఆ పాటయితే సూపర్ హిట్టయింది కానీ...ఆండ్రియా మళ్లీ తెలుగు తెరపై కనిపించ లేదు. మిగతా ఐటం భామల్లా ఈవిడ కూడా సింగ్ ఎంట్రీకే పరిమితం అయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ సుందరి మళ్లీ తెలుగు తెరపై మెరిసేందుకు సిద్ధం అవుతోంది. 'జలక్" చిత్రంలో 'అమ్మాయనుకో ఆంటీ అనుకో" అనే ఐటమ్నెంబర్తో ప్రేక్షకుల ముందుకురానుంది. 'రింగరింగా" పాట తనకు ఐటమ్గాళ్గా ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టిందని, తాజాగా 'జలక్" చిత్రంలోని ఈ పాట కూడా అదే స్థాయిలో పేరు తెస్తుందని అంటోంది ఈ భామ.