Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మత అసహనం, అవార్డులు వెనక్కి ఇవ్వడంపై అనిల్ కపూర్ స్పందన
హైదరాబాద్: దేశంలో మత అసహనం పెరిగి పోయిందంటూ కొందరు రచయితలు, సినీ ప్రముఖులు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ తప్పుబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యం కాదు, దేశ ఐక్యతకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. దేశంలో మత ఘర్షణలు కొత్త కాదని అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఎలా ఉన్న అందరూ ఐక్యతగా ఉండాలన్నారు.
బాలీవుడ్
ర్యాలీ..
దేశంలో
అసహనం
పెరిగిపోతోందని
ఆరోపిస్తూ
అవార్డులు
తిరిగిస్తోన్న
వారికి
వ్యతిరేకంగా
బాలీవుడ్
ప్రముఖులు
ర్యాలీ
నిర్వహించనున్నారు.
ఢిల్లీలో
ఈ
నెల
ఏడున
రాష్ట్రపతి
భవన్కు
ర్యాలీగా
వెళ్లాలని
సినిమా
కళాకారులు,
దర్శకులు,
నిపుణులు
నిర్ణయించారు.
దేశంలో ఆందోళన పడాల్సినంత పరిస్థితేమీ లేదని అనుపమ్ ఖేర్, మధుర్ భండార్కర్, రవీనాటాండన్ అభిప్రాయపడ్డారు. అవార్డులు తిరిగి ఇవ్వడం ఆయా సంస్థలను అవమానించడమేనని వారు అభిప్రాయపడ్డారు. అవార్డులు తిరిగి ఇస్తున్న వారు అందుకు చెబుతున్న కారణాలు వింటుంటే నవ్వు వస్తోందని చెప్పారు. అవార్డులు తిరిగి ఇస్తున్న వారు దేశంలో ఇంతకన్నా అసహనం ఎక్కువున్న సమయంలో ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ర్యాలీలో తాము కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు.
మత
అసహనంపై
షారుక్
ఖాన్
వివాదాస్పద
ఖ్యాఖ్యలు...
దేశంలో
పెరిగిపోతున్న
మత
అసహనం
మనల్ని
చీకటి
యుగానికి
తీసుకెళుతుందని
బాలీవుడ్
బాద్షా
షారుక్
ఖాన్
ఇటీవల
తన
50వ
పుట్టినరోజు
సందర్భంగా
ఎన్డీటీవీ,
ఇండియా
టుడే
చానెళ్లకు
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
చెప్పుకొచ్చారు.
అసహన
వాతావరణానికి
నిరసనగా
రచయితలు,
శాస్త్రవేత్తలు
అవార్డులు
వెనక్కి
ఇస్తుండటంపై
స్పందిస్తూ..
తాను
కూడా
పద్మశ్రీ
అవార్డును
వెనక్కి
ఇచ్చేందుకు
వెనకాడనని,
అయితే,
అలా
చేయాల్సిన
అవసరం
లేదన్నారు.
దేశంలో తీవ్ర అసహనం ఉంది. ఇలా అసహనం ప్రదర్శించడం మూర్ఖత్వం. ఇది చాలా పెద్ద సమస్య. దేశభక్తి పేరుతో మత అసహనం, లౌకికవాదిగా ఉండకపోవడం అనేది నీచమైన నేరం. అసహనం ఏ రూపంలో ఉన్నా అది చెడ్డది. అది మనల్ని చీకటి యుగాలకు తీసుకెళుతుంది. మీరు ఒకవేళ దేశభక్తులైతే.. కొన్ని ప్రాంతాలు, మతాలను మాత్రమే కాదు.. దేశం మొత్తాన్నీ ప్రేమించాలి. అసహనాన్ని నిరసిస్తూ అవార్డులు వెనక్కి ఇచ్చేవారిని గౌరవిస్తున్నాను. కానీ నేను అలా చేయాల్సిన అవసరం లేదు. మాంసం తినే అలవాట్లను బట్టి మతాన్ని నిర్వచించరాదు. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నేనూ మాట్లాడొచ్చు. కానీ జనం నా ఇంటి ముందుకు వచ్చి రాళ్లేస్తారు'' అని షారుక్ తన జన్మదిన సందేశంలో చెప్పారు.