Don't Miss!
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సినిమాను బ్రతికించండి ప్లీజ్: ‘రాజా ది గ్రేట్’ దర్శకుడి రీట్వీట్
రాజా ది గ్రేట్ సినిమా పైరసీ విచ్చలవిడిగా జరుగడంపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరూ పైరసీని ఎంకరేజ్ చేయవద్దని, అందరూ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలని కోరారు.
ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పైరసీ జోరు కూడా బాగా పెరిగింది. సినిమా విడుదలైన రోజే ఇంటర్నెట్లో పైరసీ దర్శనమిస్తోంది. పైరసీ అడ్డుకునేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది ఆగడం లేదు.
తాజాగా రవితేజ హీరోగా తెరకెక్కిన 'రాజా ది గ్రేట్' విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే సినిమా పైరసీ కూడా జోరుగా సాగుతుండటంతో దర్శక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
|
ఏకంగా ఫేస్ బుక్లో
‘రాజా ది గ్రేట్' మూవీ పైరసీ లింకులు కొందరు ఏకంగా ఫేస్ బుక్ లో కూడా షేర్ చేస్తున్నారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ అనిల్ రావిపూడి ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
|
ఎయిర్ పోర్టులో పైరసీ చూస్తూ
శంషాబాద్ ఎయిర్ పోర్టు లాంజ్ లో ఓ మహిళ ల్యాప్ టాప్ లో రాజా ది గ్రేట్ పైరసీ చూస్తుండగా నిర్మాత ఎస్కెఎన్ ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టారు. ఇది చాలా దురదృష్టకరం. సినిమాలను బతికించండి ప్లీజ్" అని వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్ ను అనిల్ రావిపూడి రీ ట్వీట్ చేశారు.
సైబర్ సెల్కు ఫిర్యాదు
రాజా ది గ్రేట్ పైరసీ గురించి సైబర్ సెల్ లో నిర్మాతలు ఫిర్యాదు చేశారు. అయితే పైరసీ లింకులు విదేశీ సర్వర్లలో ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
రాజా ది గ్రేట్
దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్పై రవితేజ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్'. అనిల్రావిపూడి దర్శకుడు. శిరీష్ నిర్మాత. మెహరీన్ హీరోయిన్. ఈ సినిమా అక్టోబర్ 18న విడుదలయి హిట్ టాక్ తెచ్చుకుంది.