Don't Miss!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘నా ట్రాక్ రికార్డ్ ఇది కాదు..’అని మహేష్ అన్నట్లుగానే...
"సినిమాలో ఓ చోట హీరో మహేశ్ చెప్పే అన్ బిలీవబుల్, అమేజింగ్, ఆసమ్ అనే డైలాగుకి సరిగ్గా సరిపోయేట్లు ఇవాళ 'దూకుడు' రికార్డు కలెక్షన్లని సాధిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. '80ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర రికార్డును తిరగరాసింది ఈ సినిమా. విదేశాల్లో 'దబాంగ్" రికార్డును అధిగమించింది. ఒక్క అమెరికాలోనే 2రోజుల్లో 15లక్షల డాలర్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. 'నా ట్రాక్ రికార్డ్ ఇది కాదు.." అన్న మహేష్ డైలాగ్ చందాన.. సినిమా వసూళ్లు కూడా సాగుతు న్నాయి. అన్ని పండగలకి సరిపడే ఆనందాన్నిచ్చిన సినిమా ఇది అన్నారు దూకుడు నిర్మాత అనీల్ సుంకర. మహేశ్ హీరోగా రూపొందిన 'దూకుడు' చిత్రం బాక్సాఫీసు వద్ద అనూహ్యమైన, అసాధారణమైన రికార్డుల్ని సృష్టిస్తున్నదని ఆ చిత్ర దర్శకుడు, నిర్మాతలు తెలిపారు. తొలి మూడు రోజుల్లో రూ. 21.22 కోట్ల షేర్ని వసూలు చేసి 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుని సాధించిందని వారు చెప్పారు.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఆల్ టైమ్ రికార్డుల్ని సృష్టిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఫిల్మ్నగర్ కల్చలర్ సెంటర్లో సోమవారం సాయంత్రం జరిపిన సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ స్పందించారు. మరో నిర్మాత... రామ్ ఆచంట మాట్లా డుతూ- 'దేశ, విదేశాల్లో ఈ స్థాయి రికార్డులను సాధించడం అందరికీ ఆనందాన్నిచ్చిందని, మన రాష్ట్రమంతా ఒకెత్తయితే అమెరికా ఒక్కటీ ఒకెత్తులా కనిపిస్తోంది. మిరకిల్, మేజిక్ అనేవి 'దూకుడు' విషయంలో అమెరికాలో జరుగుతోంది. అక్కడ మూడు రోజుల్లో 15 లక్షల డాలర్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా నమ్మశక్యంకాని గణాంకాలివి'' అన్నారు. పైరసీని ప్రోత్సహించకుండా ప్రేక్షకులు థియే టర్లో సినిమా చూసి ప్రోత్సహించాలని గోపి చంద్ ఆచంట అన్నారు. 1600పైగా థియేటర్లలో సినిమా రిలీజైందని ఆయన తెలిపారు. ఓ గొప్ప సినిమాకి పనిచేసిన అనుభూతి కలిగిందని రచయిత గోపిమోహన్ అన్నారు.