Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
రాజేష్ ఖన్నా ఫ్యామిలీపై కేసు వేసిన ప్రియురాలు
రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా, అల్లుడు అక్షయ్ కుమార్, కుతుర్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నాలపై గృహ హింస చట్టం కింద కేసు వేసింది. బాంద్రాలోని రాజేష్ ఖన్నాకు చెందిన బంగ్లా 'ఆశీర్వాద్' విషయంలోనే ఈ రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది.
దాదాపు 8 ఏళ్లుగా రాజేష్ ఖన్నాతో అనితా అద్వానీ ఆశీర్వాద్ బంగ్లాలో సహజీవనం చేస్తోంది. రాజేష్ ఖన్నా మరణం అనంతరం అనితా అద్వానీని బయటకు పంపి ఆ బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి ఖన్నా ఫ్యామిలీ ప్రయత్నిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అనితా అద్వానీ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ప్రియురాలు, సహజీవనం చేసిన మిత్రురాలు గానీ కాదని ఆయు కుటుంబ సభ్యులు అంటున్నారు. రాజేష్ ఖన్నా మరణించిన మూడు వారాల తర్వాత కుటుంబం అనితా అద్వానీ వాదనను ఖండిస్తూ బయటకు వచ్చింది. తన తండ్రి ఆస్తిలో వాటా కోరే చట్టబద్దమైన హక్కు అనితా అద్వానీకి లేదని రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ తన న్యాయవాది భేరు చౌదరి ద్వారా పంపిన నాలుగు పేజీల లేఖలో స్పష్టం చేశారు.
తాను పిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడి కుటుంబానికి చెందినదాన్నని, బాలీవుడ్లో నిర్మాతగా అడుగు పెట్టడానికి ప్రయత్నించానని అద్వానీ గతంలో చెప్పారు. తనకు ఇప్పుడు 50 ఏళ్లని, తనకు మరొకరి సహాయం అవసరమైన సమయంలో తనను ఇంటి నుంచి బయటకు పంపించేశారని ఆమె ఆరోపించారు.
బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఇంటి నుంచి తనను బయటకు గెంటేశారని ఆరోపిస్తూ అనితా అద్వానీ గృహ హింస నిరోధక చట్టం కింద తన హక్కును డిమాండ్ చేశారు. రాజేష్ ఖన్నా అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యుల తీరు తనను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆమె ఆరోపించారు.