Don't Miss!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇద్దరికీ పుత్ర శోకాలే.. : పరుచూరి.. ఒంటారయ్యాననే ఫీలింగ్ : అన్నపూర్ణ
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతి రావు మరణంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి.. నేడు తుది శ్వాస విడిచారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. కాసేపటి క్రితమే మరణించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
ఒంటరయ్యాననే ఫీలింగ్..
ప్రముఖ నటి అన్నపూర్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను ఆయన కలిసి చాలా చిత్రాల్లో కలిసి నటించాము, రేడీయో స్టేషన్లో కూడా ఆయనతో కలిసి పనిచేశాను. ఆయన విద్యావంతుడు, చాలా చక్కగా మాట్లాడే వాడు. మొన్ననే గీతాంజలి గారు వెళ్లిపోయారు.. ఓ కుటుంబంలా కలిసి ఉండేవాళ్లం.. ఇలా అందరూ వెళ్లిపోతుంటే ఒంటరయ్యామనే ఫీలింగ్ కలుగుతోంది..
అవి తీపి జ్ఞాపకాలు..
ఆయనను కలిసి చాలా కాలమే అవుతోంది.. ఆయన చెన్నైలో ఉండటం మూలానా ఈ మధ్య కలవడం లేదు. ఆయన మరణం బాధాకరమైన విషయం. ఆ మధ్యలో ఓ సినిమాలో నటిస్తారని అన్నారు. కానీ ఆరోగ్యం బాలేదనడంతో రాలేదన్నారు. సంసారం ఓ చదరంగం చేసిన రోజులన్నీ తీపి జ్ఞాపకాలు. ఆయనతో చేసినవన్నీ కుటుంబ కథా చిత్రాలే.. ఆయన ఛలోక్తిగా ఉండే తండ్రి పాత్రలు పోషించేవారు, నేను బాధ్యతాయుతమైన తల్లి పాత్రను పోషించాను. ఈ కాలంలో ఆయనలా చేసే వారు కూడా లేరు. ఆయన ఓ మంచి తండ్రి, భర్త, మంచి రచయిత. మంచి మనిషిని కోల్పోయాం.. అదెప్పుడూ వెలితిగానే ఉంటుంద'ని అన్నారు.
ఇద్దరికీ పుత్ర శోకాలే..
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నాటక రచయితగా మాకు పరిచయం, సినిమా రచయితగా కలిసి పని చేయలేదు కానీ కలిసి నటించాము. మేము దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించారు. అప్పటికే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి చిత్రాలతో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఇద్దరికీ పుత్ర శోకాలే మిగిలాయి.
Recommended Video
కొడుకు మరణంతో అలా..
మా అన్న రెండో కొడుకు మరణంతో రఘుబాబు పరిషత్ అని స్థాపించి కొత్త రచయితలకు అవార్డులివ్వగా.. ఆయన కుమారుడు శ్రీనివాస్ షూటింగ్ సమయంలో మరణించడంతో అతని పేరు మీదుగా దర్శకత్వ శాఖలో అవార్డులు ప్రధానం చేసేవారు. మంచి నటుడు, ఎలాంటి పాత్రనైనా పోషించగలవాడు, మంచి రచయిత, ఆయన రాసిన పుస్తకాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. సినీ రంగానికి, విద్యారంగానికి ఇలా అందరికీ ఆయన మరణం బాధాకరమైన అంశ'మని అన్నారు.