Don't Miss!
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజమౌళి అకౌంట్లోకి అదనంగా రూ.10కోట్లు
'మర్యాద రామన్న" చిత్రానికి గాను దర్శకుడు రాజమౌళికి దాదాపు పది కోట్లు పారితోషికంగా అందుతోందంటూ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. చిత్ర ప్రారంభానికి ముందే తన రెమ్యూనరేషన్ ని ప్రాఫిట్స్ లో షేర్ గా తీసుకుంటానంటూ నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్న రాజమౌళికి ఇప్పుడు బాగానే గిట్టుబాటు అయిందట. ఆల్ రెడీ'మర్యాద రామన్న" చిత్రానికి 25కోట్ల వరకూ బిజినెస్ పూర్తవగా శాటిలైట్ అండ్ డివిడి రైట్స్ కలిపి మరో మూడు కోట్లు అనుకున్న మొత్తంగా 28 కోట్ల సినిమా అయింది. కేవలం 12కోట్ల బడ్జెట్ తో పూర్తవనున్న ఈ చిత్రానికి 16 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టేననీ, దర్శకుడికి 10కోట్లు, నిర్మాతలకి 6 కోట్లు చొప్పున లాభాలు మిగులుతాయనీ అంటున్నారు. సునీల్ హీరోగా, సలోని హీరోయిన్ గా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు అందించారు. ఈ చిత్రంలోని పాటల్ని జులై 4న విడుదల చేస్తున్నారు.