Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వై.ఎస్ పై మరో సినిమా
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రాజశేఖర రెడ్డి పేరుతో పూరీ జగన్నాధ్ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చరిత్రపై 'వై.ఎస్.మహా ప్రస్థానం' టైటిల్ తో మరో చిత్రం తయారుకానుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల(సెప్టెంబర్) 21 వ తేదీన చేవెళ్ళలో ప్రారంభం కానుంది. 2003 ఏప్రిల్ తొమ్మిదో తేదీన వై.ఎస్.మహా ప్రస్థానం పేరిట చేవెళ్ళ నుంచి పాదయాత్రను ప్రారంభించి 1400 కిలోమీటర్లు పాదయాత్రను ఆయన కొనసాగించి ఇచ్ఛాపురంలో ముగించారు. దాంతో ఆ విషయం ప్రధానాంశంగా శ్రీ అమ్మ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత డి.సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.దర్శకుడు ఆదిత్య రూపొందించనున్న ఈ చిత్రంలో వై.ఎస్ పోలికలు కలిగిన వ్యక్తి కోసం అన్వేషించి చివరకు పిడుగు రాళ్లకు చెందిన జానిబశ ను ఎంపిక చేశారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి పాత్రను అతను పోషించనున్నారు. ఇక పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 'వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి' అనే పేరుతో చిత్రాన్ని నిర్మించనున్న చిత్రంలో రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. వీటికి తోడు దర్శకరత్న దాసరి దర్శకత్వంలో వై.ఎస్ పై ఒక చిత్రాన్ని నిర్మించాలని ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.