Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వై.ఎస్ పై మరో సినిమా
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రాజశేఖర రెడ్డి పేరుతో పూరీ జగన్నాధ్ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చరిత్రపై 'వై.ఎస్.మహా ప్రస్థానం' టైటిల్ తో మరో చిత్రం తయారుకానుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల(సెప్టెంబర్) 21 వ తేదీన చేవెళ్ళలో ప్రారంభం కానుంది. 2003 ఏప్రిల్ తొమ్మిదో తేదీన వై.ఎస్.మహా ప్రస్థానం పేరిట చేవెళ్ళ నుంచి పాదయాత్రను ప్రారంభించి 1400 కిలోమీటర్లు పాదయాత్రను ఆయన కొనసాగించి ఇచ్ఛాపురంలో ముగించారు. దాంతో ఆ విషయం ప్రధానాంశంగా శ్రీ అమ్మ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత డి.సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.దర్శకుడు ఆదిత్య రూపొందించనున్న ఈ చిత్రంలో వై.ఎస్ పోలికలు కలిగిన వ్యక్తి కోసం అన్వేషించి చివరకు పిడుగు రాళ్లకు చెందిన జానిబశ ను ఎంపిక చేశారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి పాత్రను అతను పోషించనున్నారు. ఇక పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 'వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి' అనే పేరుతో చిత్రాన్ని నిర్మించనున్న చిత్రంలో రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. వీటికి తోడు దర్శకరత్న దాసరి దర్శకత్వంలో వై.ఎస్ పై ఒక చిత్రాన్ని నిర్మించాలని ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.