Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పండ్ల తోటలో ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? అనసూయ అంటూ..
Recommended Video
అనసూయ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. అంతగా ఈ అమ్మడు ఫేమస్ అయిపోయింది. కేవలం ఓ టీవీ షో ద్వారా ఆమెకు ఇంత పాపులారిటీ రాలేదు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. ఏమాత్రం తరగని అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అందానికి తోడు బోల్డు స్టేట్మెంట్లు కూడా ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
|
సోషల్ మీడియాలో హల్చల్
అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటోంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకోవడం పరిపాటి అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ కూడా తరచూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు ట్రోలర్స్ బారిన పడుతోంది.
|
అమెరికాలో ఎంజాయ్
ఇటీవల తానా ఉత్సవాల కోసం అమెరికా వెళ్లింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. ఈ క్రమంలోనే అంతా కలిసి దేశం మొత్తం కలియ తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ను తన అభిమానులతో పంచుకుంటోంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అనందాన్ని వ్యక్త పరుస్తోంది.
పండ్ల తోటలో బుల్లి నిక్కరుతో
అమెరికా టూర్ను ఎంజాయ్ చేస్తున్న అనసూయ అక్కడ ఓ పండ్ల తోటలో తన ఫ్యామిలితో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో అనసూయ బుల్లి నిక్కరుతో కనిపించింది. దీంతో ఈ పిక్ కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన వారిలో కొంత మంది బాగుందంటుంగా.. చాలా మంది మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పండ్ల తోటలో ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ ఇలాగే..
కొద్దిరోజుల క్రిందట అనసూయ భరద్వాజ్ పోస్టు చేసిన ఫొటో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇందులో తన భర్త కింద కూర్చుని ఉండగా, ఆమె కుర్చీలో ఉండి అతడికి మసాజ్ చేస్తోంది. మసాజ్ చేయడం పెద్ద విషయం కాకపోయినా.. ఆ ఫొటోలో ఆమె వేసుకున్న డ్రెస్ మాత్రం దారుణంగా ఉంది. ఈ ఫొటోలో అనసూయ థైస్ దర్శనమిస్తుండడంతో ఆమెపైనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది బూతులతో కూడిన కామెంట్లు పెట్టారు. ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ప్రశ్నించారు.
రకుల్ కూడా ఫ్యాంట్ వేసుకోలేదంటూ..
కొద్దిరోజుల కిందట కారు దిగుతూ ఉన్న ఫొటోను రకుల్ పోస్టు చేయడం సంచలనం అయింది. ఈ పిక్లో ఆమె టాప్ మాత్రమే ధరించినట్లు కనిపించడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అంతేకాదు, ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆమె వాల్లోకి వెళ్లి ఘోరమైన కామెంట్లు చేశారు. వీరిలో ఓ నెటిజన్ ఏకంగా రకుల్ను బూతులు తిట్టాడు. దీంతో ఆమె సదరు వ్యక్తికి ఘాటు రిప్లై కూడా ఇచ్చింది.