Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
మారుతి సినిమా నుంచి ఆ హీరో తప్పుకున్నాడా? రెమ్యునరేషన్ వల్లే..
సాధారణంగా హిట్ వచ్చిన దర్శకులు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. మిడియమ్ సినిమాలను తెరకెక్కించే దర్శకులైతే కమిట్మెంట్స్ కారణంగా వీలైనంత త్వరగా షూటింగ్స్ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే చాలా కాలం తరువాత దర్శకుడు మారుతి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో లేట్ చేయాల్సి వస్తోంది. గత ఏడాది ప్రతి రోజు పండగే సినిమాతో సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే.
అసలైతే ఈ ఏడాది మార్చ్ లోనే మరో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు దర్శకుడు మారుతి. కానీ అనుకోకుండా కరోనా లాక్ డౌన్ వల్ల ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయ్యింది. హీరోల డేట్స్ కూడా మారిపోయాయి. దీంతో అందుబాటులో ఉంటారనుకున్న హీరోలు కూడా ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఫైనల్ గా రవితేజతో ఇటీవల ఒక ప్రాజెక్టుకి ఒకే చెప్పినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
అయితే రెమ్యునరేషన్ విషయంలో మాస్ రాజా కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా గాసిప్స్ వచ్చాయి. క్రాక్ తో హిట్టు కొట్టి అప్పుడు తన రేంజ్ కి తగ్గట్లు పారితోషికం తీసుకుంటానని మాస్ రాజా గట్టిగానే చాలెంజ్ చేశాడని కూడా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మాస్ రాజా వేరే సినిమాలతో బిజీ అవుతుండడం వలన ఆ ప్రాజెక్టు చేయలేనని డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. మారుతి లాంటి దర్శకుడికి మాస్ రాజా నో చెప్పడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.