Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమితాబ్కి ఏఎన్నార్ పురస్కారం
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్కి ప్రకటించారు. 2013కి సంబంధించిన పురస్కారాన్ని అమితాబ్కి అందజేస్తున్నట్టు అవార్డుల కమిటీ అధ్యక్షుడు టి.సుబ్బరామిరెడ్డి 'మనం' శతదినోత్సవంలో ప్రకటించారు. అందుకు అమితాబ్ అంగీకారం తెలుపుతూ సందేశం పంపినట్టు ఆయన చెప్పారు.
అక్కినేని నాగేశ్వరరావుకీ, అమితాబ్ బచ్చన్కీ మధ్య మంచి అనుబంధం ఉండేది. ఏఎన్నార్కి ఇష్టమైన నటుడు అమితాబ్ బచ్చన్. ఏఎన్నార్పై ఉన్న అభిమానంతో ఆయన చివరి చిత్రమైన 'మనం'లో అమితాబ్ అతిథిగా తళుక్కున మెరిశారు.
చలనచిత్ర రంగంలో అలుపెరగని 'బాటసారి' అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమాతో పాటే అడుగులేశారు. అంచలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని నటుడు అనిపించుకొన్నారు. ఏఎన్నార్ వేసిన ప్రతి అడుగూ నేటి తరానికి ఓ పాఠమే. 74 ఏళ్లపాటు చిత్ర పరిశ్రమలో కొనసాగిన అరుదైన ఘనత ఆయన సొంతం. చివరి క్షణం వరకు నటుడిగానే ఉండాలనేది నా ఆశ.. ఆకాంక్ష అనేవారు ఏఎన్నార్. అనుకొన్నట్టుగానే బతికారు. తన తనయుడు, మనవళ్లతో కలసి 'మనం'లో నటించి వీడ్కోలు చెబుతూ వెళ్లిపోయారు. అక్కినేని మన మధ్యలేకపోవచ్చు, ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రమైన 'మనం' వంద రోజుల వేడుక నేడు హైదరాబాద్లో జరుగుతుంది. అక్కినేని జయంతితో పాటు 'ఒక లైలా కోసం' ప్లాటినం డిస్క్ వేడుకను ఇదే వేదికపై నిర్వహిస్తారు.