Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అమితాబ్కి ఏఎన్నార్ పురస్కారం
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్కి ప్రకటించారు. 2013కి సంబంధించిన పురస్కారాన్ని అమితాబ్కి అందజేస్తున్నట్టు అవార్డుల కమిటీ అధ్యక్షుడు టి.సుబ్బరామిరెడ్డి 'మనం' శతదినోత్సవంలో ప్రకటించారు. అందుకు అమితాబ్ అంగీకారం తెలుపుతూ సందేశం పంపినట్టు ఆయన చెప్పారు.
అక్కినేని నాగేశ్వరరావుకీ, అమితాబ్ బచ్చన్కీ మధ్య మంచి అనుబంధం ఉండేది. ఏఎన్నార్కి ఇష్టమైన నటుడు అమితాబ్ బచ్చన్. ఏఎన్నార్పై ఉన్న అభిమానంతో ఆయన చివరి చిత్రమైన 'మనం'లో అమితాబ్ అతిథిగా తళుక్కున మెరిశారు.
చలనచిత్ర రంగంలో అలుపెరగని 'బాటసారి' అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమాతో పాటే అడుగులేశారు. అంచలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని నటుడు అనిపించుకొన్నారు. ఏఎన్నార్ వేసిన ప్రతి అడుగూ నేటి తరానికి ఓ పాఠమే. 74 ఏళ్లపాటు చిత్ర పరిశ్రమలో కొనసాగిన అరుదైన ఘనత ఆయన సొంతం. చివరి క్షణం వరకు నటుడిగానే ఉండాలనేది నా ఆశ.. ఆకాంక్ష అనేవారు ఏఎన్నార్. అనుకొన్నట్టుగానే బతికారు. తన తనయుడు, మనవళ్లతో కలసి 'మనం'లో నటించి వీడ్కోలు చెబుతూ వెళ్లిపోయారు. అక్కినేని మన మధ్యలేకపోవచ్చు, ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రమైన 'మనం' వంద రోజుల వేడుక నేడు హైదరాబాద్లో జరుగుతుంది. అక్కినేని జయంతితో పాటు 'ఒక లైలా కోసం' ప్లాటినం డిస్క్ వేడుకను ఇదే వేదికపై నిర్వహిస్తారు.