Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అత్యంత వైభవంగా ANR అవార్డ్స్.. శ్రీదేవికి పురస్కారం.. బోనీ కపూర్ కన్నీరు
నటసామ్రాట్, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేయబడిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన సినీ తారలు హాజరై సందడి చేశారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో ఎవరెవరికి అవార్డ్స్ దక్కాయి. ఆ వివరాలు చూద్దామా..
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మెగాస్టార్
హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది. బోనీ కపూర్ సహా సినీ ప్రముఖులంతా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Recommended Video
గతేడాది ఇవ్వలేదు కాబట్టి.. చిరంజీవి చేతుల మీదుగా
గతేడాది ANR అవార్డ్స్ ప్రకటించినందున ఈ ఏడాదే గత సంవత్సర అవార్డును కలుపుకుని, ఈ సంవత్సర అవార్డులు సైతం ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి, 2019 సంవత్సరానికి గాను ప్రముఖ నటి రేఖ ఈ అవార్డు సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదులగా అవార్డులను ప్రధానం చేశారు.
బోనీ కపూర్ కన్నీరు
శ్రీదేవి తరఫున ఆమె భర్త బోనీ కపూర్ ఈ ANR అవార్డును అందుకున్నారు. చిరంజీవి చేతుల మీదుగా రేఖ ఈ అవార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్బంగా బోనీ కపూర్.. భార్యను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. శ్రీదేవి తరఫున అవార్డు అందుకున్న ఆయన.. వేదికపై మాట్లాడే క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు వస్తుంటే మాట్లాడలేక.. థ్యాంక్స్ మాత్రమే చెప్పి తన స్పీచ్ ముగించాడు బోనీ కపూర్.
శ్రీదేవితో నాగార్జున అనుబంధం
ఇక ఈ ANR అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు అమల, నాగ సుశీల, నాగచైతన్య, సుమంత్, సుశాంత్, అఖిల్తో పాటు అక్కినేని అవార్డ్స్ కమిటీ చైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి, హీరో విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, శ్రీకాంత్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్బంగా శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు నాగార్జున.