Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అందరికి దండం పెడతాను.. ఎమోషనల్ అయిన హీరో జై.. తీవ్ర వివాదంలో రష్మీ 'అంతకు మించి'!
హాట్ బ్యూటీ రష్మీ, యంగ్ హీరో జై నటించిన అంతకు మించి చిత్రం ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ చిత్ర వివాదం సంచలనంగా మారింది. రష్మీ హాట్ అందాలతో ఆకర్షించిన ఈ చిత్రం ఇలా వివాదంలో చిక్కుకోవడం పట్ల హీరో జై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రం గురించి మీడియాలో వస్తున్న కథనాలకు తాజాగా ప్రెస్ మీట్ లో సతీష్ జై వివరణ ఇచ్చాడు.
విడుదలైనప్పటి నుంచి
అంతకు మించి చిత్రం విడుదలైనప్పటి నుంచి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరో, నిర్మాత తానే అని సతీష్ జై వివరణ ఇచ్చాడు. నాపై కేసు పెట్టిన వ్యక్తి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు.
50 లక్షల చీటింగ్
గౌరి శంకర్ ప్రసాద్ అనే నిర్మాత ఇటీవ ల సతీష్ జైపై బంజారా హిల్స్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనకు 50 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడని సతీష్ జై పై గౌరీశంకర్ కేసు నమోదు చేయడంతో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మోసపూరితంగా
ఈ వివాదంపై అంతకు మించి హీరో సతీష్ జై మీడియా సమావేశంలో మాట్లాడాడు. మోసపూరితంగా తన సినిమాని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించి అంతకు మించి సినిమాని చంపేశారు. ఈ వివాదంలో మీడియా మొత్తం నాకు అండగా నిలవాలి అని జై కోరాడు.
ఫేక్ డాక్యుమెంట్స్
రాత్రికి రాత్రి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి హైకోర్టులో నాపై స్టే వేశారు. నేను అతడికి 50 లక్షలు ఇవ్వాలి అన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. నాది, నా అసిస్టెంట్ ది నకిలీ సంతకాలు పెట్టారు.
తల పగిలి పోతోంది
అంతకు మించి ప్రొడ్యూసర్ ని మోసం చేసిన హీరో అని మీడియాలో వార్తలు చూస్తుంటే తల పగిలిపోతోంది. నేను కోర్టుల చుట్టూ తిరగడం తొలిసారి. వాడిపై చాలా చీటింగ్ కేసులు ఉన్నాయి. వాడు కోర్టుల చుట్టూ తిరగడం కొత్త కాదు.
దండం పెడతాను
మీ అందరికి దండం పెడతాను సార్. మీడియా గా మీరంతా నాకు సపోర్ట్ చేయండి. అతడిపై తిరిగి కేసులు పెట్టవచ్చు. కానీ అంతకు మించి చిత్రానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నా డబ్బులు తిరిగి రావు కదా అని సతీష్ జై ఆవేదన వ్యక్తం చేశాడు.