Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నిద్రించే సమయంలో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది.. అంతేర్వేదం జవాబు
ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం "అంతేర్వేదమ్" చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కు సిద్ధమైంది, జూన్ రెండవ వారంలో ట్రైలర్, ఆడియో రిలీజ్ కార్యక్రమాలు జరగనున్నాయి.
దర్శకుడు రవికిషోర్ మాట్లాడుతూ.. మనిషి చనిపోయినప్పుడు, నిద్రపోయినప్పుడు, కోమాలో ఉన్నప్పుడు అతని ఆత్మ ఎటువైపు వెళ్తుంది? ఈ మూడు దశల్లో శరీరం నుంచి బయటకు వెళ్లిన ఆత్మలు ఎక్కడ కలుస్తాయి..? మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ మనకి తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్ళి చనిపోయిన వారిని,మనకి తెలియనివారిని కలిసి వస్తుందా ? దీనినే మనం "కల" అనుకుంటున్నామా? ... ఇలాంటి విషయాలు రాసి ఉన్న తాళపత్ర గ్రంధం పేరే "అంతేర్వేదం". ఆ తాళపత్ర గ్రంధం ఆధారంగా నిర్మించిన చిత్రమే "అంతేర్వేదమ్" అన్నారు.
అమర్, సంతోషి, శాలు చౌరస్య, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ మహేష్, దొరబాబు, రవి, లడ్డు, యోగి తదితరులు నటించిన చిత్రానికి చందిన రవికిషోర్ రచన, దర్శకత్వం వహించారు. శివ దేవరకొండ కెమెరామెన్ గా జె.యెస్.నిథిత్ సంగీతం దర్శకత్వం వహించారు.