Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సినిమాల్లో మాఫియా డబ్బు: పోలీసులు, పైరసీ అప్లికేషన్ రిలీజ్
ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి మాట్లాడుతూ... సినీ పరిశ్రమకు నష్టం కలిగించడమే కాకుండా సంఘవిద్రోహ శక్తులకు కాసులు కురిపిస్తున్న పైరసీని అరికట్టేందుకు అంతా సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన యాంటీ పైరసీ మొబైల్ అప్లికేషన్ 'ఇండియన్ మూవీ కాప్(IMC)'ను భారత్లోని అమెరికా రాయబారి నాన్సీ జేపావెల్ చేతుల మీదుగా విడుదల చేసారు. ఈ అప్లికేషన్ను అందరూ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పైరసీ సమాచారం అందించడానికి, అరికట్టడానికి ఇది ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది.
పైరసీ కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమలో ఏటా 5.72 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, రూ. 5400 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని నాన్సీ తెలిపారు. డాక్టర్ డి. రామానాయుడు, శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరానికి 120 సినిమాలు నిర్మిస్తున్న తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ వల్ల వేల కోట్ల రూపాయాల నష్టం వాటిల్లు తుందని, అనేక థియేటర్లు మూత పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. పైరసీ సమాచారం అందిస్తే బహుమతి ఇస్తామని రమేష్ ప్రసాద్ అన్నారు.
పైరసీ సొమ్ము మాఫియా చేతుల్లోకి వెళ్లి తిరిగి సినిమా రంగంలోకి పెట్టుబడి రూపంలో వస్తోందని సీఐడీ చీఫ్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆరేవేల రైట్స్ చేసి 4 వేల మందిని అరెస్టు చేసామని, అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేక పోవడం వల్ల శిక్షలు తక్కువగా పడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో రాజమౌళి, దిల్ రాజు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు.