Don't Miss!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- News SRH Vs RCB మ్యాచ్: ఉప్పల్ మార్గంలో అర్ధరాత్రి వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రామ్ గోపాల్ వర్మ... నా డార్లింగ్, బానిసను (ఫోటోస్)
హైదరాబాద్: మంచు విష్ణు, తేజస్వి జంటగా ఏవీ పిక్చర్స్ పతాకంపై రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆర్.ఉదయ్ కుమార్, గజేంద్రనాయుడు, పార్థసారథినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అనుక్షణం'. ఈ టైటిల్ కి ట్యాగ్ లైన్ 'అమ్మాయిలు జాగ్రత్త'. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ప్రోమోను మంగళవారం విడుదల చేసారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ - ''రాంగోపాల్ వర్మతో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. రౌడీ సినిమా చేసేటప్పుడు మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 24గంటలు సినిమా గురించి ఆలోచించే రాంగోపాల్ వర్మ అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అందుకే నేను ఆయనకు బానిసను. అనితో చేసిన ఒక్క సినిమాకే అభిమాన దర్శకుడు అయ్యాడు. అందుకే ఆయన నా డార్లింగ్ అని వ్యాఖ్యానించారు.
సినిమా థియేటర్లు కొంతమంది చేతిలో ఉంటున్నాయి. 'అనుక్షణం' సినిమా ద్వారా మేం ప్రవేశపెట్టిన వేలం పాట పద్ధతి వల్ల థియేటర్ల ఏ ఒక్కరి చేతిలోనూ ఉండిపోవు. ఈ బిజినెస్ కొత్త ఒరవడిని తీసుకువస్తుందనే నమ్మకం ఉంది.. ఈ బిజినెస్ గురించి రాంగోపాల్ వర్మ, విష్ణు నా దగ్గర చెప్పగానే చాలా బాగుంది గో హె హెడ్ అన్నాను. దాసరి నారాయణరావుగారు, రాఘవేంద్రరావులాంటి దర్శకులు కూడా ఈ బిజినెస్ చాలా బాగుందని చెప్పారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు...
వర్మ మాట్లాడుతూ...
సినిమా వ్యాపారం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో వేలం పాట ద్వారా సినిమా అమ్మడం అనే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. రెస్పాన్స్ కూడా బాగుంది అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ
'బిడ్డింగ్ పద్ధతి ద్వారా సినిమాని బిజినెస్ చేస్తున్నామని ప్రకటించగానే మంచి స్పందన వచ్చింది. ఐదువందల మంది పైగా ఈ బిడ్ లో పాల్గొనడానికి ముందుకొచ్చారు. ఏ ఏరియాకు ఎంత బిడ్ వచ్చిందో పేపర్ యాడ్ ఇస్తాం. ఈ బిడ్ లో క్రెడిట్ కార్డ్ పద్ధతిని పెట్టలేదు. అది కూడా పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. శనివారం 6గంటలవరకూ ఈ బిడ్ ఓపెన్ లో ఉంటుంది అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ
వేలం పాట పద్దతి బాగుంది. ఇకపై పరిశ్రమలో అదే నడుస్తుందనే నమ్మకం ఉంది. నేను, మోహన్ బాబు కలిసి సినిమా చూసాం. చాలా ఆసక్తిగా సినిమాని మలిచారు రాంగోపాల్ వర్మ. విష్ణు ని కొత్తగా ప్రజెంట్ చేసారు. హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా కలిగిస్తుందన్నారు.
మధుశాలిని మాట్లాడుతూ
''రాంగోపాల్ వర్మ గారితో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. విష్ణుతో నాకు ఇది తొలి సినిమా. ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా సీరియస్ పాత్ర చేసాను అని అన్నారు.
అనుక్షణం
నవదీప్, మధుశాలిని, రేవతి, కోటా శ్రీనివాసరావు, సన, సుప్రీత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.