Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మీడియాపై విరుచుకుపడ్డ అనుష్క
శ్రీకాళహస్తి : అనుష్క బుధవారం వాయులింగేశ్వరుని దర్శనార్థం వచ్చారు. త్రినేత్ర అతిథి గృహం నుంచి ఆమెను బందోబస్తుతో ముక్కంటి దర్శనార్థం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు వచ్చిన కొందరు మీడియా పట్ల అనుచితంగా వ్యవహరించారు. ఆలయానికి వచ్చినా ప్రశాంతత లేకుండా పోతోందంటూ అనుష్క మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.
విషయాన్ని తెలుసుకున్న ఈవో శ్రీరామచంద్రమూర్తి అక్కడకు చేరుకొని మీడియా ప్రతినిధులపై ఆగ్రహానికి గురయ్యారు. ఎంతో దూరం నుంచి.. వచ్చే భక్తులకు ప్రశాంతత కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈవో సర్ధి చెప్పారు. అనుష్కతో పాటు ఫొటోల్లో పడేందుకు పలువురు అభిమానులు పోటీలు పడ్డారు. మహద్వారం నుంచి లోనికి వెళ్లే సమయంలోనూ అభిమానులు ఆమె వెంట ఉన్నారు. గందరగోళ పరిస్థితి నెలకొనకుండా ఆలయ భద్రతా ఉద్యోగులు జాగ్రత్త పడ్డారు.
ఇక అనూష్క నటించిన మిర్చి చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే ఆమె తెలుగులనూ వరస సినిమాలు ఒప్పుకుంటోంది. ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క ఎంపికైనట్లు సమాచారం. ఈ చిత్రం ఓ పీరియడ్ డ్రామా గా నడవనుంది. గతంలో అనూష్క...రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన 'విక్రమార్కుడు'లో నటించింది.
అనూష్క వరస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి అడిగిన వెంటనే డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి చిత్రం కోసం ఆమె బల్క్ గా డేట్స్ కేటాయించనున్నారు. దాంతో ఆమె ఈ చిత్రం పూర్తయ్యే దాకా దాదాపు వేరే సినిమాలు కమిటయ్యే అవకాసం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేయాలి. గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న రుద్రమదేవి చిత్రం కోసం కూడా ఆమె ఎక్కువ రోజులు డేట్స్ ఇస్తున్నారు.