Don't Miss!
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అందుకు అనుష్కను అభినందిస్తున్నా: నాగార్జున
'అరుంధతి' తర్వాత చంద్ర వెళ్లి అడగ్గానే...ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ సినిమా చేసింది అనుష్క. ఈ విషయంలో అనుష్కను అభినందిస్తున్నా అన్నారు నాగార్జున. అనుష్క హీరోయిన్ గా నాగార్జున పర్శనల్ మేకప్ మ్యాన్ బొమ్మదేవర రామచంద్రరావు నిర్మిస్తున్న 'పంచాక్షరి' చిత్ర ఆడియో పంక్షన్ హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా హాజరైన నాగార్జున మాట్లాడుతూ...పై విధంగా స్పందించారు. నిర్మాత గురించి ఆయన మాటల్లోనే..."చంద్ర నా కొత్త సినిమాకు మేకప్మాన్ గా లేకపోవడం వెలితిగా ఉంది. ఇద్దరం దాదాపు ఒక్కసారే కెరీర్ మొదలుపెట్టాం. నేను చేసిన ప్రతి సినిమాకూ చంద్రనే మేకప్ మన్. తను ఓం ప్రదంగా ఎవరికైనా మేకప్ వేశాడంటే..వారు కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకునేవారు. తన చెయ్యి అంత మంచిది. అనుష్కకు తొలిసారి మేకప్ చేసింది చంద్రనే. మా సంస్థలో వచ్చిన 'సూపర్' ఆమె తొలిచిత్రం. ఆ సినిమా సమయంలోనే అనుష్కకు మేకప్ చూస్తూ...'అమ్మా.. రేపు నువ్వు గొప్ప స్టార్ అయితే..నాకో సినిమా చేసిపెడతావా?..' అని అడిగాడు చంద్ర. అనుష్క 'ఓకే' అంది. అప్పట్లో అందరం దాన్ని తేలిగ్గా తీసుకున్నాం. 'అరుంధతి' తర్వాత చంద్ర వెళ్లి అడగ్గానే... ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ సినిమా చేసింది అనుష్క. ఈ విషయంలో అనుష్కను అభినందిస్తున్నా. 'పంచాక్షరి' తర్వాత చంద్ర పెద్ద నిర్మాతగా ఎదగాలి. తన సినిమాలో చేయడానికి నాలాంటి హీరోలందరూ ఎదురు చూడాలి' అని అక్కినేని నాగార్జున అన్నారు.