Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాత్రి ఎనిమిది దాటితే అనుష్క ఆ పనికి దూరం
అనుష్క ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ స్టార్. అయితే ఆమె సౌందర్య రహస్యం యోగానే అనుకుంటారు. అయితే వాటితో పాటు తను పాటించే ఆహార నియమాలు కూడా అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..."భోజనం విషయంలో నేనెప్పుడూ స్ట్రిక్ట్గానే ఉంటాను. మితమైన ఆహారానికే ఎప్పుడూ నా ఓటు" అంది. అలాగే "ప్రతి రోజూ 30-40 నిమిషాలు కార్డియో చేస్తాను. నీళ్ళు ఎక్కువగా తాగుతాను. రాత్రిపూట ఎనిమిది దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయను. చర్మ సౌందర్యానికి క్లెన్స్, స్క్రబ్, మాయిశ్చరైజర్... ఈ మూడూ తప్పనిసరి. ఈ మూడింటి మీద దృష్టి పెడితే ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. తాజా చర్మం మీ సొంతమవుతుంది" అంటూ తన అసలు సీక్రెట్ ని వివరించింది. మరి కొద్ది రోజుల్లో ఆమె నటించిన ఖలేజా చిత్రం విడుదల కానుంది. ఆమె ప్రస్తుతం నాగార్జున సరసన వీరూపోట్ల దర్శకత్వంలో చేస్తోంది. అలాగే వేదం తమిళ రీమేక్ లోనూ ఆమె చేస్తోంది.