twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోతో కలిసి బెడ్ మీద అనుష్క... ఫోటో షేర్ చేసిన డైరెక్టర్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కరణ్ జోహార్ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా ‘యే దిల్ మై ముష్కిల్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సమయం తెలియకుండా కష్టపడుతున్నారు. షూటింగులో పాల్గొని పాల్గొని అలసి పోయిన రణబీర్, అనుష్క ఒకే బెడ్ మీద కూలపడిపోయి నిద్రలోకి జారుకున్నారు.

    ఈ ఫోటోను కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ...యే దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగులో నటీనటులు, టెక్నీషియన్స్ మీద ఓవర్ వర్క్ లోడ్ పడింది. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం అంటూ కరణ్ జోహార్ ఈ ఫోటోను షేర్ చేసారు.

    ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా అతిథి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

    1977లో విడుదలైన ‘దూస్రా ఆద్మీ' చిత్రానికి రీమేక్ గా ‘యే దిల్ హై ముష్కిల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2016 దివాళి నాటికి విడుదల చేయాలనే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది ఆ చిత్ర టీం. ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ లాంటి స్టార్ల ఉండటం వల్ల సినిమాకు మంచిరెస్పాన్స్ వస్తుందని దర్శకుడు కరణ్ జోహార్ భావిస్తున్నారు.

    English summary
    The film director and producer Karan Johar took a picture when the lead pair having nap on bed.Karan Johar shared the pic tweeting Nonstop shoot for #AeDilHaiMushkil ...overworked cast and crew! Here's a sneak peek "
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X