Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అనుష్క-విరాట్ అభిమానులు దాన్ని బంగారం చేసేశారు!
ఈ ఏడాది దేశంలో అత్యధికంగా హాట్ టాపిక్ అయిన అంశాల్లో హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెళ్లి. ట్విట్టర్లో కూడా ఈ టాపిక్ సంచలనం అయింది. పెళ్లి పూర్తయిన తమ మ్యారేజ్ పిక్తో కలిపి వీరు చేసిన ట్వీట్ 'గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్'గా రికార్డులకెక్కింది. ట్విట్టర్ ఇండియా తాజాగా విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం... వీరు చేసిన ఈ ట్వీట్ ఈ ఏడాది ఎక్కువ మంది రీ ట్వీట్ చేశారట.
ఆ ట్వీట్ ఇదే...
అనుష్క-విరాట్ కోహ్లి డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం అనుష్క ట్విట్టర్ ద్వారా ఈ ట్వీట్ చేశారు. ఒకరు సినిమా స్టార్, మరొకరు క్రికెట్ స్టార్ కావడంతో దీన్ని అత్యధిక మంది రీట్వీట్ చేశారు.
సల్మాన్, షారుక్
బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఈ ఏడాది ట్విట్టర్లో మోస్ట్ టాక్డ్ మేల్ సెలబ్రిటీలుగా నిలిచారు. వీరి తర్వాత అమితాబ్ బచ్చన్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ గురించి మాట్లాడుకున్నారట.
హీరోయిన్లలో దీపిక పదుకోన్
ఇక ట్విట్టర్లో ఫిమేల్ సెలబ్రిటీల గురించి అయితే దీపిక పదుకోన్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారట. ఆమె నటించిన పద్మావతి మూవీ వివాదాస్పదం అయింది. దీపికకు బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో దీపిక గురించి ట్విట్టర్లో ఎక్కువ చర్చించారట. ఆమె తర్వాతి స్థానంలో అలియా భట్, ప్రియాంక చోప్రా, శ్రద్దా కపూర్, భూమి పడ్నేకర్ లాంటి వారు ఉన్నారు.
రయీస్ సినిమా టాప్
షారుక్ ఖాన్ నటించిన ‘రయీస్' మూవీ అంత పెద్ద విజయం ఏమీ కాదు. అయితే ఈ సినిమా గురించే ఈ ఏడాది ఎక్కువగా ట్విట్టర్లో మాట్లాడుకున్నారట. సల్మాన్ టైగర్ జిందా హై, ట్యూబ్ లైట్ చిత్రాలు రెండో స్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానంలో ‘టాయిలెట్ ఏక్ ప్రేమ కథా', గోల్ మాల్ ఎగైన్, జగ్గా జాసూస్ చిత్రాలు నిలిచాయి.