Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ డైరెక్టర్తో సైలెంట్గా అనుష్క శెట్టి.. సమంతకు షాకే!
కొద్దికాలంగా సినిమాల సంఖ్యను తగ్గించిన అనుష్క శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కాబోతున్నది. ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెండితెర అరుంధతి మరో క్రేజీ ప్రాజెక్ట్ను చేజిక్కించుకున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్లో అనుష్క ఎంటర్ కావడంతో ఈ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకొన్న సమంతకు ఓ రకంగా షాక్ తగిలినట్టే అనే మాట సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఇంతకు ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏమింటంటే..
నిశ్శబ్దంగా అనుష్క శెట్టి జోరు
టాలీవుడ్లో చాలా గ్యాప్ తర్వాత అంటే భాగమతి చిత్రం తర్వాత అనుష్కశెట్టి నిశ్శబ్దం అనే సస్పెన్స్ థ్రిల్లర్లో నటిస్తున్నది. బహుభాషా చిత్రంగా రూపొందిద్దుకొంటున్న ప్రాజెక్ట్లో మాధవన్, అంజలి, షాలిని పాండే లాంటి తారలు నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రమోషన్ ఇటీవలే ఊపందుకొన్నది.
ఏం మాయ చేశావే 2కు గ్రీన్ సిగ్నల్
ఇలా నిశ్శబ్దం చిత్రంతో అనుష్క రెడీ అవుతూనే ఏం మాయ చేశావే 2 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించే చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ విషయంపై అటు గౌతమ్ గానీ.. అనుష్క గానీ నోరు విప్పకపోవడంతో క్లారిటీ మిస్ అవుతున్నది.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ క్లారిటీ
ఇక ఇటీవలే ఇన్స్టాగ్రామ్ లైవ్లో గౌతమ్ వాసుదేవన్ మీనన్ పలు విషయాలు వెల్లడించారు. ఏం మాయ చేశావే మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నానని, అయితే ఆ సినిమా గురించి స్పష్టమైన వివరాలు తన వద్దలేవని పేర్కొన్నారు. శింబును కలిసి స్క్రిప్టు నేరేట్ చేసే పనిలో ఉన్నానని, ఆ పాత్రను ఆయన తప్ప మరొకరు చేయలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సమంత, త్రిషను వదిలేసి అనుష్కశెట్టితో
అయితే శింబును ప్రత్యేకంగా ప్రస్తావించిన గౌతమ్.. సమంతను, త్రిషను వదిలేసి అనుష్కను ఈ ప్రాజెక్టులో తీసుకోవాలనే ప్రయత్నం వెనుక కారణాలు ఆసక్తిగా మారాయి. ఏం మాయ చేశావే సినిమాలో సమంత నటన ఇప్పటికీ ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంది. అలాంటి సమంత లేకుండా ఏం మాయ చేశావేను ఊహించుకోవడం కష్టమే అంటున్నారు సిని అభిమానులు.
Recommended Video
నటుడిగా గౌతమ్ బిజీగా
గౌతమ్ మీనన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో నటుడిగా కూడా బిజీ అవుతున్నారు. దుల్కర్ సల్మాన్ నటించిన కనులు కనులు దోచాయంటే సినిమాలో కీలక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. ఈ చిత్రంలో ఆయన ఫెర్ఫార్మెన్స్కు మంచి పేరుతోపాటు ప్రేక్షకాదరణ కూడా బాగా వస్తున్నది.