Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్కశెట్టి
బాహుబలి తర్వాత అనుష్కశెట్టి పెద్దగా సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు. గత ఏడాదిగా కేవలం భాగమతిలోనే ఆమె కనిపించింది. ఆ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఆ చిత్రం తర్వాత పెద్దగా కొత్త సినిమాలకు ఒకే చెప్పిన దాఖలాలు లేవు. తాజాగా గోపిచంద్తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆచిత్రానికి నా నువ్వే ఫేమ్ జయేంద్ర దర్శకత్వం వహించనున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్, తమన్నాతో నా నువ్వే చిత్రాన్ని దర్శకుడు జయేంద్ర తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఆ చిత్రం తర్వాత కిరణ్ ముప్పవరపు, విజయ్ రూపొందించే చిత్రంలో అనుష్క నటించనున్నారు.
గోపిచంద్తో రూపొందించే చిత్రంలో నటించేందుకు అనుష్క ఒప్పుకొన్నారు. గోపిచంద్ తాజా చిత్రం షూటింగ్ ముగియగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత ఈ జోడి నటించేందుకు సిద్ధమైంది అని చిత్ర యూనిట్కు చెందిన వారు వెల్లడించారు.