Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్కశెట్టి
బాహుబలి తర్వాత అనుష్కశెట్టి పెద్దగా సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు. గత ఏడాదిగా కేవలం భాగమతిలోనే ఆమె కనిపించింది. ఆ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఆ చిత్రం తర్వాత పెద్దగా కొత్త సినిమాలకు ఒకే చెప్పిన దాఖలాలు లేవు. తాజాగా గోపిచంద్తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆచిత్రానికి నా నువ్వే ఫేమ్ జయేంద్ర దర్శకత్వం వహించనున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్, తమన్నాతో నా నువ్వే చిత్రాన్ని దర్శకుడు జయేంద్ర తెరకెక్కించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఆ చిత్రం తర్వాత కిరణ్ ముప్పవరపు, విజయ్ రూపొందించే చిత్రంలో అనుష్క నటించనున్నారు.
గోపిచంద్తో రూపొందించే చిత్రంలో నటించేందుకు అనుష్క ఒప్పుకొన్నారు. గోపిచంద్ తాజా చిత్రం షూటింగ్ ముగియగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత ఈ జోడి నటించేందుకు సిద్ధమైంది అని చిత్ర యూనిట్కు చెందిన వారు వెల్లడించారు.