Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జీరో: అనుష్కకు ఒక్క పైసా దక్కలేదు!
హైదరాబాద్: సౌత్లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క విభిన్నమైన సినిమాలు చేస్తూ దూసుకెలుతోంది. బాహుబలి, రుద్రమదేవి, వర్ణ లాంటి సినిమాలకు అనుష్క తప్ప మరో ఆప్షన్ దొరకడం లేదు దర్శక నిర్మాతలకు. ప్రస్తుతం అనుష్క హై రేంజిలో దూసుకెలుతున్నా..‘సైజ్ జీరో' లాంటి సాధారణ సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనకడలేదు.
ఈ మధ్య పలువురు స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా....ఆ డబ్బును సినిమా నిర్మాణంలోనే ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లు మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వారు ఇప్పటికే ఇలాంటి చేసారు. తాజాగా సైజ్ జీరో విషయంలో కూడా అనుష్క ఇలానే చేసినట్లు తెలుస్తోంది.
తనకు రావాల్సిన రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ నిర్మాత పివిపితో కలిసి సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టిందట. సినిమా బాక్సాఫీసు వద్ద బాగా ఆడితే అనుష్కకు లాభాల్లో వాటా దక్కేది. అయితే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా నిరాశ పరిచింది. దీంతో అనుష్కకు ఒక్క పైసా కూడా దక్కలేదట.
ఈ సినిమా కోసం అనుష్క చాలా కష్టపడింది. దాదాపు 20 కేజీల బరువు పెరిగింది. ఇపుడు మళ్లీ ఆ బరువును తగ్గించుకోవడానికి కష్టపడుతోంది. మొత్తానికి సైజ్ జీరో సినిమా వల్ల అనుష్కకు సమయం వృధా అవడంతో పాటు.... రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ కూడా లాస్ అయింది.