Don't Miss!
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- News భక్తులకు గుడ్న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘భాగమతి’ తర్వాత ఎట్టకేలకు మరో సినిమాకు సైన్ చేసిన అనుష్క!
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించకుండా ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. 'భాగమంతి' తర్వాత ఆమె ఏ ప్రాజెక్టుకు సైన్ చేయక పోవడం, హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయ పర్యటనకు వెళ్లడం లాంటివి చేయడంతో ఆమె పెళ్లికి సిద్ధం అవుతోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే అనుష్క పెళ్లి ఆలోచనలో లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నమాట.
'భాగమతి' సినిమా కోసం కాస్త బరువు పెరిగిన అనుష్క కొన్ని రోజులుగా వెయిట్ లాస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, అందుకే ఏ సినిమాకు సైన్ చేయలేదని, మళ్లీ సినిమా కథలు వింటున్నారని, నెక్ట్స్ మూవీకి సైన్ చేసిందని టాక్.
గోపీచంద్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం కోసం అనుష్కను సంప్రదించారని, కథ నచ్చడంతో ఆమె వెంటనే ఒకే చెప్పిందని తెలుస్తోంది. ఇంతకు ముందు గోపీచంద్-అనుష్క కాంబినేషన్లో లక్ష్యం, శౌర్యం చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం గోపీచంద్ 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే జయేంద్ర దర్శకత్వంలో అనుష్క హీరోయిన్గా సినిమా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.