Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘భాగమతి’ తర్వాత ఎట్టకేలకు మరో సినిమాకు సైన్ చేసిన అనుష్క!
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించకుండా ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. 'భాగమంతి' తర్వాత ఆమె ఏ ప్రాజెక్టుకు సైన్ చేయక పోవడం, హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయ పర్యటనకు వెళ్లడం లాంటివి చేయడంతో ఆమె పెళ్లికి సిద్ధం అవుతోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే అనుష్క పెళ్లి ఆలోచనలో లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నమాట.
'భాగమతి' సినిమా కోసం కాస్త బరువు పెరిగిన అనుష్క కొన్ని రోజులుగా వెయిట్ లాస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, అందుకే ఏ సినిమాకు సైన్ చేయలేదని, మళ్లీ సినిమా కథలు వింటున్నారని, నెక్ట్స్ మూవీకి సైన్ చేసిందని టాక్.
గోపీచంద్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం కోసం అనుష్కను సంప్రదించారని, కథ నచ్చడంతో ఆమె వెంటనే ఒకే చెప్పిందని తెలుస్తోంది. ఇంతకు ముందు గోపీచంద్-అనుష్క కాంబినేషన్లో లక్ష్యం, శౌర్యం చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం గోపీచంద్ 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే జయేంద్ర దర్శకత్వంలో అనుష్క హీరోయిన్గా సినిమా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.