Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అప్పట్పుంచి భయం వెంటాడుతూనే ఉంది: అనుష్క
హీరోయిన్ గా కెరీర్ ఆరంభించినప్పుడు సినిమాలు చేసినంతకాలం ప్రతి పాత్రకు పూర్తి న్యాయం చేయాలని ఫిక్స్ అయ్యాను. అప్పట్పుంచి ఇప్పటివరకు నటిగా ఓడిపోతానేమో అనే భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. అందుకే ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తుంటాను అంటోంది అనుష్క. ప్రస్తుతం కంటిన్యూగా తెలుగు,తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే తను యోగా టీచర్ కావటం కూడా తన సినీ కెరీర్ కి ప్లస్ అయ్యిందంటోంది. యోగా చేయడంవల్ల సహనం అలవడింది. ఒక సీన్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఎన్నిసార్లు యాక్ట్ చేయమన్నా ఓపికగా చేస్తుంటాను. కోపం అస్సలు రాదు. నేను యాక్ట్ చేసిన సినిమా సక్సెస్ అయినప్పుడు విపరీతంగా ఆనందపడిపోవడం, ఫెయిల్యుర్ వచ్చినప్పుడు బాధపడిపోవడం జరగదు. ఈ రెండింటికీ సమానంగా స్పందిస్తాను. దానికి కారణం యోగా. షూటింగ్ స్పాట్లో చాలా ఉత్సాహంగా ఉంటాను. షూటింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆ విషయం మర్చిపోయి నా పర్సనల్ లైఫ్లోకి ఎంటరైపోతాను. యోగా చేయడంవల్లే ఇలా ఉండటానికి కుదరుతోంది. యోగా చేయడంవల్ల శారీరకంగా, మానసికంగా బాగుంటుంది. కాబట్టి యోగావల్ల అన్నీ లాభాలే అంది.
నాగార్జున సరసన ఆమె ఢమురకం చిత్రం చేస్తోంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా రూపొందుతోంది. షూటింగ్ జరుగుతున్న ఢమురుకం చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనుష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ... గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడుకీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.