నాగబాబు కాకుండా మరోకరయితే ఆత్మహత్య:చిరంజీవి
తమ కుటుంబం విడిపోలేదని కలసికట్టుగానే ఉందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్సష్టం చేశారు. కుటుంబం విడిపోయిందన్న వార్తలపై జర్నలిస్టులపై ఆయన మండిపడ్డారు. జర్నలిజం ఎటుపోతుందో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెంజ్ సినిమాకి నాగబాబు కాకుండా మరొకరు నిర్మాత అయి ఉంటే ఆత్మహత్య చేసుకొని ఉండేవారన్నారు. పీఆర్పీ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి చెప్పారు.ఇక నాగబాబు ఆరంజ్ సినిమా తీసి బాగా నష్ట పోయిన మాట వాస్తవమే.అయితే ఆప్పుడు రామ్ చరణ్ తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చివేశారని,అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ మరో ఐదు కోట్ల సాయం అందించడమే కాకుండా, వేరే పేరుతో గబ్బర్ సింగ్ అనే సినిమా తీయడానికి సహకరిస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











