Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Bheemla Nayakపై జగన్ ప్రభుత్వం మరింత ఫోకస్.. రంగంలోకి CPRF.. మరికొన్ని థియేటర్స్ క్లోజ్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత సినిమా థియేటర్స్ లో అసలైన సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ కూడా భీమ్లా నాయక్ మొదటి రోజు మొదటి సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని థియేటర్స్ ఉహించని రిలీజ్ రోజే క్లోజ్ అవ్వడం విషెస్. శుక్రవారం విడుదలైన రోజు జగన్ ప్రభుత్వం మరింత స్పెషల్ గా రంగంలోకి CPRFను దింపడం హాట్ టాపిక్ గా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
పాజిటివ్ ఓపెనింగ్స్..
సితార ఎంటర్టైన్మెంట్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన ఫస్ట్ మూవీ భీమ్లా నాయక్ కు ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ కు కూడా భారీ స్థాయిలో స్పందన వచ్చింది. రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గానే వస్తున్నాయి.
మళ్ళీ పాత పద్దతిలోనే..
అయితే భీమ్లా నాయక్ సందడి మొదలైనప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెరవెనుక అలజడి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కొంత మంది స్టార్ హీరోలు జగన్మోహన్ రెడ్డిని కలిసి చిత్ర పరిశ్రమలో టిక్కెట్ల రేట్లపై కొత్త నిర్ణయం తీసుకోవాలి అని విన్నవించుకున్న విషయం తెలిసిందే. అయితే మరి కొన్ని రోజుల్లోనే కొత్త జీవో వస్తుంది అని చాలా బలంగా చెప్పిన జగన్ సర్కార్ భీమ్లా వచ్చేసరికి ఒక్కసారిగా మళ్లీ పాత పద్ధతిలోకి రావడం విశేషం.
ఎక్కువ షోలు వేసుకోకుండా..
వకీల్ సాబ్ సినిమా కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించడం విశేషం. ఇక ప్రత్యేకంగా పోలీసు బలగాలను రప్పించారు. ఎక్కువ షోలు వేసుకోకుండా అలాగే టిక్కెట్ల రేట్లు కూడా తాము నిర్వహించిన జీవో ప్రకారమే ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన ఆంక్షల నడుము పవన్ కళ్యాణ్ సినిమాలను కొనసాగించింది.
ఫ్యాన్ షోలు లేకుండా..
టికెట్ల రేట్లు తక్కువగా ఉండాలని అన్ని వర్గాల వారికి వినోదం సమపాళ్లలో ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు గా జగన్ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. అయితే పెద్ద సినిమాలకు పది రూపాయల, 20 రూపాయల టికెట్లు ఉంటే ఆ సినిమాలకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద హీరోల సినిమాలు అంటేనే అభిమానులకు ప్రత్యేకంగా ఫ్యాన్ షోలో ఉండడం విశేషం. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు కి వచ్చేసరికి అలాంటిదేమీ లేకుండా ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
ప్రత్యేకంగా CPRF బలగాలు
చాలా సినిమా థియేటర్స్ దగ్గర ప్రత్యేకంగా CPRF బలగాలను రంగంలోకి దింపడం విశేషం. ఎక్కడ హడావుడి లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో వకీల్ సాబ్ సినిమాకు కూడా ఇదే తరహాలో ఆంక్షలు కొనసాగించిన ప్రభుత్వం ఇప్పుడు అంతకు మించి అనేలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని పలువురు ప్రముఖులు ఆరోపిస్తున్నారు.
60 థియేటర్స్ క్లోజ్
ఇక జగన్ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలతో దాదాపు శుక్రవారం రోజు అరవై థియేటర్లు క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఒక్కో థియేటర్ దగ్గర ఇద్దరు లేదా నలుగురు రెవెన్యూ ఆఫీసర్లు కూడా డ్యూటీ చేస్తుండడం విశేషం. ఇంతకు ముందు ఏ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుని జాగ్రత్తలు భీమ్లా నాయక్ సినిమా కోసమే తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.