Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'అజ్ఞాతవాసి' కంటే 'జైసింహా'కే తక్కువ: పవన్కు అది బెడిసికొట్టింది, బాలయ్యకు వర్కౌట్ అవుతుందా?
Recommended Video
సంక్రాంతి రేసులో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అభిమానులు దాన్నో ఛాలెంజ్ లాగే తీసుకుంటారు. గెలుపు మా హీరోదంటే మా హీరోదేనని వాదించుకుంటారు.
చివరాఖరికి బొమ్మ పడితే కానీ ఎందులో మేటర్ ఎంతనేది తేలదు. హిట్టు కొడితే.. అవతలి హీరో ఫ్యాన్స్ ముందు కాలర్ ఎగిరేసుకుని మరీ తిరుగుతారు. బొమ్మ బోల్తా కొడితే ఆ ఛాన్స్ అవతలి వాళ్లకు వెళ్లిపోతుంది.
సినిమా హిట్టా.. ఫట్టా.. అన్నది డిసైడ్ చేసేది ఫైనల్ గా కలెక్షన్లే కాబట్టి.. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి. ఏపీలో అదనపు 'షో'ల విషయంలో 'జైసింహా' కన్నా 'అజ్ఞాతవాసి'కే ఎక్కువ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.
'అజ్ఞాతవాసి'కి 8 రోజులు:
జనవరి 10న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10వ తేదీ నుండి 17 వరకు.. మొత్తంగా 8 రోజులు ఈ చిత్ర అదనపు షోల కోసం ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంటే అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట నుంచి ఉదయం 10గం. వరకు ఎన్ని 'షో'లైనా వేసుకోవచ్చు.
'జైసింహా'కి 5 రోజులు:
ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా సినిమా 'జైసింహా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అదనపు 'షో'ల కోసం ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ.. ఐదు రోజులకే దాన్ని పరిమితం చేసింది. 'అజ్ఞాతవాసి'కి 8రోజులు అనుమతిచ్చిన ప్రభుత్వం.. జైసింహాకు మాత్రం ఐదు రోజులే అనుమతివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
'అజ్ఞాతవాసి'కి కలిసిరాలేదు:
డివైడ్ టాక్ తెచ్చుకున్న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' విషయంలో ప్రత్యేక 'షో'లు కలిసిరాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెగటివ్ టాక్ సెకండ్ షోకే వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించడంతో.. థియేటర్ యాజమాన్యాలు కూడా అదనపు 'షో'లపై పునరాలోచలనలో పడ్డట్టు చెబుతున్నారు.
'అజ్ఞాతవాసి'కి పెద్దగా ఏం ఒరగలేదు
అటు అభిమానులు, ప్రేక్షకులు కూడా రాత్రి వేళ అదనపు 'షో'ల పట్ల అంతగా ఆసక్తి కనబరచట్లేదన్న వాదన వినిపిస్తోంది. సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. ఇప్పుడైతే జనాలు చాలావరకు తగ్గుముఖం పట్టినట్లే చెబుతున్నారు. ఒకవిధంగా రోజుకు ఏడు 'షో'ల వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదంటున్నారు.
ఇప్పుడే అంచనా వేయలేం:
'అజ్ఞాతవాసి'కి హిట్ టాక్ వచ్చి ఉంటే.. కచ్చితంగా కలెక్షన్లు దుమ్మురేపేది. రోజుకు ఏడు 'షో'లు ఎనిమిది రోజుల పాటు అనుమతివ్వడం కూడా సినిమాకు కలిసొచ్చేది. కానీ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఎంతమేర ఉండవచ్చనేది అంచనా వేయలేని పరిస్థితి.
'జైసింహా'కి వర్కౌట్ అవుతుందా?..:
జైసింహాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటు ఏడు 'షో'లకు అనుమతినివ్వడం సినిమాకు కలిసిరావచ్చు. పవన్ 'అజ్ఞాతవాసి' విషయంలో బెడిసికొట్టిన ఏడు 'షో'ల వ్యవహారం జైసింహాకు వర్కౌట్ అవుతుందా?.. లేదా?.. అన్నది వేచి చూడాలి.