Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
బ్రాహ్మణులకు షాక్: హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట
హైదరాబాద్: దేనికైనా రెడీ, ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న బ్రాహ్మణులకు షాకింగ్ న్యూస్. ఈ రెండు సినిమాల్లోని అభ్యంతరాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన కమిటీలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డు ఓకే చేసిన తర్వాత మళ్లీ కమిటీలు ఎందుకని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వం కమిటీ వేయడంపై ఈ చిత్ర నిర్మాత మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.... కమిటీకి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక ప్రభుత్వ జోక్యం సరికాదని మోహన్ బాబు పిటిషన్లో పేర్కొన్నారు. ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం నిర్మాత కూడా ఇదే విధమైన పిటీషన్ వేసారు. ఈ రెండు పిటీషన్ల నేపథ్యంలో..... తాజాగా శుక్రవారం హైకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది.
కాగా... దేనికైనా రెడీ చిత్రంపై ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం సినిమా వీక్షించారు. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని తేల్చారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలను నమోదు చేశామని, వీటిపై శుక్రవారం చిత్రనిర్మాత మోహన్ బాబు, హీరో విష్ణును పిలిపించి చర్చిస్తామని కమిటీ ఛైర్మన్ రేమండ్ పీటర్ తెలిపారు. అయితే తాజాగా హైకోర్టు స్టే విధించడంతో ఈ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోరని స్పష్టం అవుతోంది.
మరో వైపు దేనికైనా రెడీ వివాదం ఇంటర్నేషణల్ లెవల్ కి చేరుకుంది. అంతర్జాతీయ హిందూ సంస్థ 'గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్' ఈ చిత్రం వివాదంపై స్పందించింది. దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.