Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్ షూటింగ్ కోసం అపోలో హాస్పటిల్ క్లోజ్
హైదరాబాద్: రామ్ చరణ్ తాజా చిత్రం 'జంజీర్'కోసం హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని కాన్సర్ హాస్పటిల్ లోని కొంత భాగాన్ని క్లోజ్ చేసారు. ఆ ప్రాంతం మొత్తం షూటింగ్ కి వచ్చిన యూనిట్ సభ్యులు,పెద్ద పెద్ద లైట్స్,కెమెరాలు,ట్రాలీలు,కేబుల్స్ తో నిండిపోయింది. అయితే పేషెంట్స్ ఎవరికీ ఏ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకునే ఈ షూటింగ్ జరిపారని తెలుస్తోంది. ఇక హాస్పటిల్ స్టాఫ్ తో సహా చాలా మంది ఈ షూటింగ్ కి వచ్చి చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ షెడ్యూలు 22 రోజులు పాటు జరగనుంది.
అపోలో హాస్పటిల్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి మనుమరాలు ఉపాసన ని రామ్ చరణ్ వివాహం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఫర్మిషన్ సాధ్యమైంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ ఏ షూటింగ్ ఇలా జరగలేదు. ఇక ఈ షూటింగ్ లో ప్రియాంక చోప్రా,రామ్ చరణ్ కలిసి హాస్పటిల్ కి వచ్చే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. దర్శకుడు అపూర్వ లఖియా తెలుగు,హిందీ భాషల్లో ఒకే సారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. తెలుగు వెర్షన్ కు గానూ దర్శకుడు యోగి పనిచేస్తున్నారు.
అలాగే 'జంజీర్' చిత్రంలో విలన్ గా అతుల్ కులకర్ణి నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఖరారు చేసారు. 'జంజర్ రీమేక్ లో నేను నటిస్తున్నాను. ఈ చిత్రంలో పూర్తిగా సరికొత్త పాత్ర పోషిస్తున్నాను. దర్శకుడు అపూర్వ లఖియా నా పాత్రను అద్బుతంగా రూపొందించారు' అని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు. అతుల్ కులకర్ణి గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'పంజా' చిత్రంలో విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్.