Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Sai Dharam Tej Accident:48 గంటలు దాటితే చెప్పలేం.. దేవుడిని ప్రార్థించాల్సిందే.. అపోలో వైద్యులు
టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తేజ్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు రాత్రి 12 గంటల ప్రాంతంలో బులెటిన్ రిలీజ్ చేశారు. సాయిధరమ్ తేజ్కు న్యూరోసర్జన్ డాక్టర్ అలోక్ రంజాన్, క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి, పాలమనాలకిస్ట్ డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్, ఆర్థోపెడిక్స్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డితో కూడిన బృందం సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చారు. అయితే 48 గంటల దాటితే ఏం చెప్పలేమని చెప్పడం ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అపోలో వైద్యులు వెల్లడించినదేమిటంటే..
అపోలో హాస్పిటల్ బృందం
సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి అపోలో వైద్యులు బులెటిన్ వెల్లడిస్తూ.. సాయిధరమ్ తేజ్కు యాక్సిడెంట్ కాగానే సమీపంలో ఉన్న హాస్పిటల్కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అపోలో హాస్పిటల్కు తరలిస్తున్నట్టు సమాచారం అందించడంతో క్రిటికల్, ఎమర్జన్సీ టీమ్ అలర్ట్ అయ్యాం. డాక్టర్లు, ఇతర వైద్యులు సిద్దంగా ఉన్నాం. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచాం అని అపోలో వైద్యుడు వెల్లడించారు.
ఆందోళన పడాల్సిన అవసరం లేదు..
ఆందోళన పడాల్సిన అవసరం లేదు..
అపోలో వైద్యుడు అలోక్ రంజన్ మాట్లాడుతూ.. సాయిధరమ్ తేజ్కు తలకు, మెదడుకు, వెన్నుముకకు గాయం కాలేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ప్రాథమికంగా స్కానింగ్, ఇతర రిపోర్టులను పరిశీలిస్తున్నాం. సాధారణంగా రోడ్డు ప్రమాదంలో ఉండే తీవ్రత సాయిధరమ్ తేజ్కు లేకపోవడం శుభపరిమాణం అని అన్నారు.
ఆందోళన పడాల్సిన అవసరం లేదు..
అపోలో వైద్యుడు అలోక్ రంజన్ మాట్లాడుతూ.. సాయిధరమ్ తేజ్కు తలకు, మెదడుకు, వెన్నుముకకు గాయం కాలేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ప్రాథమికంగా స్కానింగ్, ఇతర రిపోర్టులను పరిశీలిస్తున్నాం. సాధారణంగా రోడ్డు ప్రమాదంలో ఉండే తీవ్రత సాయిధరమ్ తేజ్కు లేకపోవడం శుభపరిమాణం అని అన్నారు.
ఆందోళన పడాల్సిన అవసరం లేదు..
అపోలో వైద్యుడు అలోక్ రంజన్ మాట్లాడుతూ.. సాయిధరమ్ తేజ్కు తలకు, మెదడుకు, వెన్నుముకకు గాయం కాలేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ప్రాథమికంగా స్కానింగ్, ఇతర రిపోర్టులను పరిశీలిస్తున్నాం. సాధారణంగా రోడ్డు ప్రమాదంలో ఉండే తీవ్రత సాయిధరమ్ తేజ్కు లేకపోవడం శుభపరిమాణం అని అన్నారు.
భుజం ఎముక విరిగింది అంటూ
మరో వైద్యుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి వెల్లడిస్తూ.. హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత మెడికవర్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించారు. ఇప్పుడు అపోలో హాస్పిటల్కు తీసుకొచ్చారు. ఆయన భుజానికి సంబంధించిన ఎముక విరిగిపోయింది. ప్రస్తుతం దానికి ఎలాంటి చికిత్స అవసరం లేదు అని ఆరోపెడిక్ సర్జన్ తెలిపారు.
48 గంటలకు దాటితే గానీ..
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన ప్రాణాలకు ముప్పేమి లేదు. సాధారణంగా రోడ్డు ప్రమాదంలో బాధితుడి పరిస్థితిని 48 గంటలు దాటితే తప్ప ఏమీ చెప్పలేం. ఎందుకంటే.. బైక్ మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా గాయం కావొచ్చు. ఆ విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తాం. ఆయన తప్పుకుండా కోలుకొంటారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందిస్తున్నాం. వెంటిలెటర్పై ఉంటే ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు కాదు అని ఆర్థోపెడిక్ సర్జన్ చెప్పారు.
Recommended Video
శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో
అయితే సాయిధరమ్ తేజ్కు శ్వాస సంబంధింత సమస్య తలెత్తడంతోపాటు ముందు జాగ్రత్తగా వెంటిలెటర్పైకి తరలించారు అని వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే రోడ్డు ప్రమాదంలో గాయాలను అప్పటికప్పుడు అంచనావేయలేని పరిస్థితి ఉంటుందని, అందుకే వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామనే విషయాన్ని వెల్లడించారు.