Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
కేరళ బాధితుల కోసం రూ. 1 కోటి విరాళం ప్రకటించిన ఏఆర్ రెహమాన్
ఇండియన్ మ్యూజిక్ సంచలనం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కేరళ వరద బాధితుల కోసం రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రెహమాన్ తన టీంతో కలిసి యూఎస్ఏలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సాయాన్ని ప్రకటించారు. మేము చేసేది చిన్న సహాయమే అయినా కేరళలోని మన బ్రదర్స్, సిస్టర్స్కు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
యూఎస్ఏలోని వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ రెహమాన్ అండ్ టీమ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాషింగ్టన్లో తన ప్రదర్శన సందర్భంగా రెహమాన్ ఈ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కేరళ ప్రజలను ఉద్దేశించి... 'కేరళ, కేరళ, డోన్ట్ వర్రీ కేరళ' అంటూ పాట పాడారు.
సెప్టెంబర్ 5న రెహమాన్ తన పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వస్తారని తెలుస్తోంది. వచ్చిన తర్వాత ఆయన మణిరత్నం మూవీ 'చిక్క చివంత వనమ్'(తెలుగులో 'నవాబ్') మూవీ ప్రమోషన్లలో బిజీగా కాబోతున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకలో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని టాక్.
From my artistes and me touring the USA... To our brothers and sisters of Kerala!
— A.R.Rahman (@arrahman) September 2, 2018
May this small offering help in providing you some relief! pic.twitter.com/9tyxtns3gr
కేరళ వరదల్లో దాదాపు 483 మంది మరణించారు. వేలాది మంది ఇళ్లను కోల్పోయారు. కేరళ పరిస్థితి చూసి చలించిపోయిన ఇతర ప్రాంతాల ప్రజలు, సినీ సెలబ్రిటీలు భారీగా సహాయం అందించారు. పలువురు స్టార్స్ భారీ ఎత్తున విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.