Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కేరళ బాధితుల కోసం రూ. 1 కోటి విరాళం ప్రకటించిన ఏఆర్ రెహమాన్
ఇండియన్ మ్యూజిక్ సంచలనం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కేరళ వరద బాధితుల కోసం రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రెహమాన్ తన టీంతో కలిసి యూఎస్ఏలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సాయాన్ని ప్రకటించారు. మేము చేసేది చిన్న సహాయమే అయినా కేరళలోని మన బ్రదర్స్, సిస్టర్స్కు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
యూఎస్ఏలోని వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ రెహమాన్ అండ్ టీమ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాషింగ్టన్లో తన ప్రదర్శన సందర్భంగా రెహమాన్ ఈ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కేరళ ప్రజలను ఉద్దేశించి... 'కేరళ, కేరళ, డోన్ట్ వర్రీ కేరళ' అంటూ పాట పాడారు.
సెప్టెంబర్ 5న రెహమాన్ తన పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వస్తారని తెలుస్తోంది. వచ్చిన తర్వాత ఆయన మణిరత్నం మూవీ 'చిక్క చివంత వనమ్'(తెలుగులో 'నవాబ్') మూవీ ప్రమోషన్లలో బిజీగా కాబోతున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకలో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని టాక్.
From my artistes and me touring the USA... To our brothers and sisters of Kerala!
— A.R.Rahman (@arrahman) September 2, 2018
May this small offering help in providing you some relief! pic.twitter.com/9tyxtns3gr
కేరళ వరదల్లో దాదాపు 483 మంది మరణించారు. వేలాది మంది ఇళ్లను కోల్పోయారు. కేరళ పరిస్థితి చూసి చలించిపోయిన ఇతర ప్రాంతాల ప్రజలు, సినీ సెలబ్రిటీలు భారీగా సహాయం అందించారు. పలువురు స్టార్స్ భారీ ఎత్తున విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.