Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఏఆర్ రెహమాన్ తనయుడు ఆరంగ్రేటం!
10 సంవత్సరాల అమీన్ ఈ వేడుకలో మణిరత్నం రోజా చిత్రంలోని ఓ చిన్న మెలొడీని పియానోపై ప్లే చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అదే విధంగా రెహమాన్కు సంబంధించిన కెఎం మ్యూజిక్ కన్సర్వేటరీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకకు నటి సుహాసినిమణిరత్నం, సౌతిండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, దర్శకుడు అమీర్ మరియు సినిమాటోగ్రాఫర్ ఎస్ పి జననాథ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ... తమిళనాడు ప్రభుత్వ సహకారం మరియు సుహాసిని ఆమె టీం తోడ్పాటు లేకుంటే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యేది కాదన్నారు. ఈ వేడుక నిర్వహించడానికి ప్రభుత్వాన్ని నిధులు విడుదల చేయాలని, తమను ప్రోత్సహించి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని కోరినట్లు వెల్లడించారు.
8 రోజుల పాటు సాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 50పైగా దేశాల నుంచి వచ్చిన 154 చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ఇందులో 12 తమిళ చిత్రాలతో పాటు 9 ఇండియన్ పనోరమ, 133 విదేశీ చిత్రాలు ఉన్నాయి. ఇందులో ప్రదర్శితం కానున్న 12 తమిళ సినిమాల ఎంపికకు నటుడు శివకుమార్, సినిమాటోగ్రాఫర్ బిఆర్ విజయలక్ష్మి, నేషనల్ అవార్డు విన్నింగ్ తమిళ దర్శకుడు ఎ సర్కునమ్ జడ్జిలుగా వ్యవహరించారు. ఈ నెల 20 ఫిల్మ్ ఫెస్టివల్ ముగియనుంది. ముగింపు వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వచ్చన్ హాజరైన విజేతలకు బహుమతి ప్రధానం చేయనున్నారు.