Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏఆర్ రెహమాన్ తనయుడు ఆరంగ్రేటం!
10 సంవత్సరాల అమీన్ ఈ వేడుకలో మణిరత్నం రోజా చిత్రంలోని ఓ చిన్న మెలొడీని పియానోపై ప్లే చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అదే విధంగా రెహమాన్కు సంబంధించిన కెఎం మ్యూజిక్ కన్సర్వేటరీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకకు నటి సుహాసినిమణిరత్నం, సౌతిండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, దర్శకుడు అమీర్ మరియు సినిమాటోగ్రాఫర్ ఎస్ పి జననాథ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ... తమిళనాడు ప్రభుత్వ సహకారం మరియు సుహాసిని ఆమె టీం తోడ్పాటు లేకుంటే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యేది కాదన్నారు. ఈ వేడుక నిర్వహించడానికి ప్రభుత్వాన్ని నిధులు విడుదల చేయాలని, తమను ప్రోత్సహించి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని కోరినట్లు వెల్లడించారు.
8 రోజుల పాటు సాగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 50పైగా దేశాల నుంచి వచ్చిన 154 చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ఇందులో 12 తమిళ చిత్రాలతో పాటు 9 ఇండియన్ పనోరమ, 133 విదేశీ చిత్రాలు ఉన్నాయి. ఇందులో ప్రదర్శితం కానున్న 12 తమిళ సినిమాల ఎంపికకు నటుడు శివకుమార్, సినిమాటోగ్రాఫర్ బిఆర్ విజయలక్ష్మి, నేషనల్ అవార్డు విన్నింగ్ తమిళ దర్శకుడు ఎ సర్కునమ్ జడ్జిలుగా వ్యవహరించారు. ఈ నెల 20 ఫిల్మ్ ఫెస్టివల్ ముగియనుంది. ముగింపు వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వచ్చన్ హాజరైన విజేతలకు బహుమతి ప్రధానం చేయనున్నారు.