Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అరవింద సమేత ఓవర్సీస్ హక్కులు మళ్ళీ వారికే సొంతం.. అందుకేనా!
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో రాబోతున్న చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎన్టీఆర్, పూజ హెగ్డే ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.
ఈ చిత్రం ఇంకా సెట్స్ పై ఉండగానే ప్రీరిలీజ్ బిజినెస్ మొదలైపోయినట్లు తెలుస్తోంది. ఎల్ ఏ తెలుగు సంస్థ అరవింద సమేత ఓవర్సీస్ హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి ఓవర్సీస్ హక్కులని సొంతం చేసుకుంది కూడా ఈ సంస్థే.
అజ్ఞాతవాసి చిత్రంతో ఈ సంస్థకు నష్టాలు మిగిలాయి. అజ్ఞాతవాసి చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికే అరవింద సమేత హక్కులని ఎల్ ఏ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అయినా వారికీ లాభాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాల్సి ఉంది. దసరా కానుకగా అరవింద సమేత చిత్రాన్ని విడుదల చేయనున్నారు.