Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తమిళ అర్జున్రెడ్డి మరో షాకింగ్ న్యూస్.. అసిస్టెంట్ డైరెక్టరే..
Recommended Video
తెలుగు ఇండస్ట్రీకి సెన్సేషన్ హిట్ అందించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్నది. హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడం తెలిసిందే. తమిళంలో వర్మ పేరుతో తొలుత ప్రముఖ దర్శకుడు బాలా తెరకెక్కించారు. అయితే అవుట్ పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో దర్శకుడిని తప్పించి తిరిగి రీ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు చాలా సెన్సేషనల్గా మారాయి. అవేమిటంటే..
ఆదిత్య వర్మగా రీ షూట్
ప్రస్తుతం వర్మ టైటిల్ను మార్చేసి ఆదిత్య వర్మగా తెరకెక్కుతున్న సినిమాకు గిరీశయ్య దర్శకుడు. గిరీశయ్య తెలుగు అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్లో శరవేగంగా జరుగుతున్నది. ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ సినిమాను తెలుగుకు భిన్నంగా రూపొందిస్తున్నట్టు సమాచారం.
65 శాతం మేర పూర్తి
అయితే ఆదిత్య వర్మ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ మీడియాలో సంచలనం రేపింది. ఈ సినిమాకు సంబంధించిన విషయంపై సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ తన ట్విట్టర్లో స్పందించారు. షూటింగ్ స్పాట్కు సంబంధించిన స్టిల్ను పోస్టు చేస్తూ.. ఆదిత్య వర్మ షూటింగ్ 65 శాతం పూర్తయింది. ఇది ఓ రికార్డు. చిత్ర యూనిట్కు థాంక్స్ అని ట్వీట్ చేశారు.
ధ్రువ్ సరసన బనిత సంధూ హీరోయిన్గా
ఆదిత్య వర్మ రీ షూట్ మార్చి నెలలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. నెలల వ్యవధిలోనే 65 శాతం పూర్తి కావడం సెన్సేషన్గా మారింది. విక్రమ్ తనయుడు ధృవ్ సరసన బనిత సంధూ హీరోయిన్గా నటిస్తున్నది. రాధాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యహరిస్తున్నారు.
హిందీలో అర్జున్ రెడ్డి క్రేజీగా
ఇదిలా ఉండగా, హిందీ అర్జున్ రెడ్డి మే నెలలో రిలీజ్కు సిద్దమవుతున్నది. కబీర్ సింగ్గా ఈ చిత్రం రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో షాహీద్ కపూర్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒరిజినల్ కంటే హిందీలోనే బాగుందని షాహీద్ కపూర్ను ప్రభాస్ ప్రశంసించారు.