Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నలభీముడిగా నారా రోహిత్.. చేపల కూర వండిన హీరో..
హీరో నారా రోహిత్ నలభీముడిగా మారాడు. ఇటీవల సినిమా సెట్లో పూదీనా బిర్యాని చేసి చిత్ర యూనిట్ ఆశ్చర్యంలో ముంచెత్తిన నారా వారి అబ్బాయి.. మరోసారి తన పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని బయటపెట్టుకొన్నాడు. వంట వండుత
హీరో నారా రోహిత్ నలభీముడిగా మారాడు. ఇటీవల సినిమా సెట్లో పూదీనా బిర్యాని చేసి చిత్ర యూనిట్ ఆశ్చర్యంలో ముంచెత్తిన నారా వారి అబ్బాయి.. మరోసారి తన పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని బయటపెట్టుకొన్నాడు. వంట వండుతుండగా తీసిన అప్పటి ఫోటోను నటుడు సుధీర్బాబు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. బిర్యానీ కమ్మగా ఉంది అని కామెంట్ పెట్టాడు.
శమంతకమణి షూటింగ్లో తాజాగా నారా రోహిత్ చేపల కూర వండారు. చిత్ర యూనిట్ రుచికరమైన చేపల కూరను రుచి చూపించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ భవ్యా క్రియేషన్స్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. 'మా ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ 'శమంతకమణి' సినిమా సెట్లో రుచికరమైన చేపల కూర వండారు' అని పేర్కొంది.
'శమంతకమణి'లో నారా రోహిత్, సుధీర్బాబు, సందీప్ కిషన్, ఆది ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నారా రోహిత్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాత. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేయనున్నారు.