Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఓవర్ డిమాండ్: రామ్ చరణ్-బోయపాటి సినిమా నుంచి రిషి పంజాబీ ఔట్....
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #ఆర్సి12 ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ తప్పుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందే బాలీవుడ్లో కమిట్మెంట్స్ ఇవ్వడం వల్లే ఆయన తప్పుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా అతడిని తాత్కాలికంగా అక్టోబర్ వరకు కాంట్రాక్టు మీద తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే అనుకోని కారణాలతో షూటింగ్ షెడ్యూల్ పొడగించాల్సి వచ్చింది. దీంతో అతడు ఎక్స్ట్రా పేమెంట్ డిమాండ్ చేశాడని చర్చించుకుంటున్నారు.
పెరిగిపోతున్న రాంచరణ్ సినిమా బడ్జెట్.. ఊహించని పరిణామాలు!
ఓవర్గా డిమాండ్ చేయడం వల్లనేనా?
అయితే బడ్జెట్ ఇప్పటికే ఎక్కువ అవుతుండటంతో అతడి సేవలు ఇక చాలని, రిషి పంజాబీ స్థానంలో మరొకరిని తీసుకోవాలని నిర్ణయించారట. ఆయన స్థానంలో ఆర్థర్ ఎ విల్సన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన సినిమా షూటింగ్ విల్సన్ ద్వారా పూర్తి చేయనున్నారట. మరో 20 రోజుల షూటింగ్ మిగిలి ఉన్నట్లు సమాచారం.
ఇంకా టైటిల్ ఖరారు కాలేదు
ప్రస్తుతం #ఆర్సి12 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. నటుడు ప్రశాంత్ రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో కనిపించనున్నారు. స్నేహ, రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బోయపాటి
రామ్ చరణ్తో చేస్తున్న మొదటి సినిమా కావడంతో దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అయ్యేలా తీర్చి దిద్దుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
టాలీవుడ్ భారీ మాస్ యాక్షన్ మూవీ కాబోతోందా?
దర్శకుడు బోయపాటి సినిమా అంటే మాస్ మెచ్చే భారీ యాక్షన్ దద్దరిల్లిపోయేలా ఉంటుంది. అందులో మెగా పవర్ స్టార్ లాంటి టాప్ యాక్టర్ ఉంటే... బాక్సాఫీసు షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. రామ్ చరణ్ గత చిత్రం ‘రంగస్థలం' రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.