Don't Miss!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బొబ్బిలిపులి నిద్రలేచింది...నో ప్రాబ్లం బాబూ మోహన్
బొబ్బిలిపులి లాంటి దాసరి నారాయణరావు నిద్ర లేచారని...చిత్ర పరిశ్రమలోని ఆ నలుగురి నిర్మాతల భరతం పట్టేందుకు ఆయన రెడీ అయ్యారని మాజీ మంత్రి, హాస్యనటుడు బాబు మోహన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ధన్నారం గ్రామంలో తెలుగుదేసం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా దాసరి నారాయణరావు మాటలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. చిత్రపరిశ్రమ ఆ నలుగురి కబంధ హస్తాల్లో ఉన్న విషయాన్ని తాను గతంలోనే చెప్పానని ఇప్పుడు ఇక దాసరి కూడా అదే అన్నారు కాబట్టి ఆ నలుగురి ఆటలు సాగవన్నారు. తన కుమారుడు ఉదయ్ బాబు హీరోగా నటించిన సమ్మక్క..సారక్క మహత్యం సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు. దాసరి స్పందించి చిన్న చిత్రాలకు అనుకూలంగా మాట్లాడుతూ చిత్ర పరిశ్రమను కాపాడేందుకు చేస్తున్న కృషిని నటుడిగా స్వాగతిస్తానని బాబుమోహన్ తెలిపారు. దాసరి...రాజశేఖర్ హీరోగా నట్టికుమార్ నిర్మిస్తున్న మా అన్నయ్య బంగారం చిత్రం ప్రారంభానికి వచ్చి ఆ నలుగురు నిర్మాతల చేతుల్లో చిన్న సినిమా నష్టపోతోందన్నారు.