Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆయన తీస్తూండటమేనా..రిలీజులుండవా?
పవన్ కళ్యాణ్ తో తమ్ముడు చిత్రం తీసి హిట్టిచ్చిన దర్శకుడు అరుణ్ ప్రసాద్ తాజాగా 'ఎలెవెన్' అనే టైటిల్ తో చిత్రాన్ని ప్రారంభిచటం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ మూడు సినిమాలు తీసి రిలీజ్ కాకుండా ఈ చిత్రం ప్రారంభం కావటం ఆశ్చర్యపరుస్తోంది. తమ్ముడు చిత్రం 'గౌతమ్ ఎస్.ఎస్.సి.'అంటూ ప్లాప్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బ్రహ్మానందం,వైయస్ ప్రధాన పాత్రల్లో గోకరాజు చిత్రం తీసాడు. అప్పట్లో ఆ చిత్రం ఎలక్షన్లో కాంగ్రేస్ ప్రచారానికి ఉపయోగపడుతుందని ఆశించారు. అయితే అది ఇంకా పినిష్ కాలేదు. అది ప్రక్కన పెడితే భూమిక, నవదీప్ కాంబినేషన్లో 'యాగం'అని చిత్రం చేసాడు. అందులో నవదీప్ నగ్నంగా కనపడతాడని ప్రచారం చేసినా ఎందుకో రిలీజ్ కు నోచుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో జగపతిబాబు హీరోగా 'మా నాన్న చిరంజీవి' (అంటే ఓ పెద్ద హీరో)అంటూ తీసాడు. హాలీవుడ్ హిట్ పర్యూష్ ఆఫ్ హ్యాపీనెస్ చిత్రానికి కాపీగా ఈ చిత్రం వస్తోందని వినికిడి. ఇక తాజాగా ప్రారంభిచిన ఈ ఎలెవెన్' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ప్లాన్ చేస్తున్నారు. అలాగే నవదీప్, శ్రీరామ్ ఇందులో హీరోలుగా నటించనున్నారు. ఏదైమైనా అరుణ్ ప్రసాద్ మంచి టాలెంట్ కదా.