ఫేస్బుక్లో నగ్నచిత్రాన్ని పోస్ట్ చేసిన స్టార్ హీరోయిన్
సాధారణంగా ఫేస్బుక్ యూజర్లు తమకు సంబంధించిన మంచి ఫోటోలను ప్రొఫైల్ పిక్గా పెట్టుకుంటారు, లేదంటే ఖాలీగా వదిలేస్తారు. కానీ బాలీవుడ్కు చెందిన ఈ ముద్దుగుమ్మ 'అరుణ షీల్డ్స్' మాత్రం తన నగ్న చిత్రాన్ని ప్రొఫైల్ పిక్గా పెట్టుకొని సంచలనం సృష్టించింది. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ముందు ఈమె ఎవరో మనకి తెలియాలి కదా..! తెలుగులో రక్త చరిత్ర సినిమా ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్న వివేక్ ఒబేరాయ్ (పరిటాల రవి పాత్ర పోషించిన హీరో) సరసన బాలీవుడ్లో "ప్రిన్స్" అనే చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ రాకుమారికి ఇటీవల తట్టు (అమ్మవారు) వ్యాధి సోకింది.
దీంతో ఆమె మొహం మరియు వళ్లంతా దద్దుర్లతో నిండిపోయి, బాడీ వెయిట్ తగ్గి బక్కగా అయిపోయి పేషెంట్లా మారిపోయింది. తన అనారోగ్య పరిస్థితిని తన అభిమానులతో పంచుకునేందుకు ఈ బాలీవుడ్ సెక్సీ భామ తన బాడీలోని ప్రైవేట్ పార్ట్లను అరచేతులతో కప్పి ఉంచిన ఓ నగ్న చిత్రాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. గుర్తు పట్టలేనంతగా మారిపోయి ఉన్న తమ అభిమాన హీరోయిన్ని చూసిన అభిమానులు అవాక్కయ్యి అస్సలు ఆ చిత్రంలో ఉన్న అరుణ షీల్డ్సేనా అని విస్మయానికి లోనవుతున్నారు.
ఈ పిక్తో పాటు అరుణ తన స్టేటస్ మెసేజ్ను కూడా పోస్ట్ చేసింది. దాని సారాంశం ఇది... "అస్వస్థత మరియు మచ్చలతో నేను మిస్ మియాస్లెస్ (తట్టు)గా మారిపోయాను. శుక్రవారం 13న నా వంటిపై దద్దుర్లు వచ్చాయి. ఈ వైరస్ చాలా బాధిస్తోంది, నరకంలో ఉన్నట్లుగా ఉంది" అంటూ తన బ్లాగ్లో పేర్కొంది. అరుణ పరిస్థితి చూసి కొందరు అభిమానులు తనపట్ల జాలి వ్యక్తం చేస్తుంటే మరికొందరు నగ్న చిత్రాన్ని పోస్ట్ చేయడం పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైతేనం సాటి మనిషులుగా ఆమె త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం. అయితే.. అరున ఇలా అందాలను బయటపెట్టుకోవడం ఇదేం మొదటిసారి కాదు.
గతంలో కూడా "మిస్టర్ సింగ్ మిస్సెస్ మెహతా" అనే సినిమాలో తన అందాలను ఆరబోసి యువతకు కిర్రెక్కించింది. ఈ చిత్రంలో నగ్నంగా నటించి అరుణ అప్పటి హెడ్లైన్స్లో నిలించింది.


Click it and Unblock the Notifications











