ప్రాణం తీసిన 'అరుంధతి'

By Staff

Arundhati
శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అరుంధతి సినిమా అన్ని సెంటర్లలోనూ సంచలన కలెక్షన్స్ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అరుంధతి చిత్రం చూస్తూ గుండెపోటు తెచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందటం విషాదానికి గురిచేస్తోంది. విశాఖ జిల్లా తగరపు వలసలో తాతా ధియోటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సినిమా సూపర్ హిట్ టాక్ రావటంతో తన భార్యా పిల్లలతో అదే ఊరుకు చెందిన సూరిబాబు వెళ్ళారు. అయితే ఇంటర్వెల్ వరకూ సినిమా బాగా ఎంజాయ్ చేసిన అతను ఆ తర్వాత ఛాతీ నొప్పితో వాలిపోయాడు. భార్యా పిల్లలు కంగారు పడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళేలోగానే ప్రాణం పోయింది.

ఇక ఈ సినిమాలో అనూష్క అధ్బుతంగా నటించింది. అలాగే కొన్ని సన్నివేశాల్లో భీబత్స రసం బాగా పండటం జరిగింది. గతంలోనూ ఇటువంటి సంఘటనలు హర్రర్ చిత్రాల విడుదల అప్పుడు చోటు చేసుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో విలన్ గా నటించిన సోనూసూద్ తన కొడుక్కి పద్దినిమేళ్ళు వచ్చేదాకా ఈ సినిమా చూపెట్టననటం ఇక్కడ గుర్తుచేసుకోవాల్సిన అంశం. ఇక పబ్లిసిటీలో ఈ సినిమాకి హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు..పెద్ద వయస్సు వారు, చిన్న పిల్లలూ దూరంగా ఉండటం మేలని చెబితే బాగుంటుందనేది కొందరి సూచన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X