twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాణం తీసిన 'అరుంధతి'

    By Staff
    |

    Arundhati
    శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అరుంధతి సినిమా అన్ని సెంటర్లలోనూ సంచలన కలెక్షన్స్ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అరుంధతి చిత్రం చూస్తూ గుండెపోటు తెచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందటం విషాదానికి గురిచేస్తోంది. విశాఖ జిల్లా తగరపు వలసలో తాతా ధియోటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సినిమా సూపర్ హిట్ టాక్ రావటంతో తన భార్యా పిల్లలతో అదే ఊరుకు చెందిన సూరిబాబు వెళ్ళారు. అయితే ఇంటర్వెల్ వరకూ సినిమా బాగా ఎంజాయ్ చేసిన అతను ఆ తర్వాత ఛాతీ నొప్పితో వాలిపోయాడు. భార్యా పిల్లలు కంగారు పడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళేలోగానే ప్రాణం పోయింది.

    ఇక ఈ సినిమాలో అనూష్క అధ్బుతంగా నటించింది. అలాగే కొన్ని సన్నివేశాల్లో భీబత్స రసం బాగా పండటం జరిగింది. గతంలోనూ ఇటువంటి సంఘటనలు హర్రర్ చిత్రాల విడుదల అప్పుడు చోటు చేసుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో విలన్ గా నటించిన సోనూసూద్ తన కొడుక్కి పద్దినిమేళ్ళు వచ్చేదాకా ఈ సినిమా చూపెట్టననటం ఇక్కడ గుర్తుచేసుకోవాల్సిన అంశం. ఇక పబ్లిసిటీలో ఈ సినిమాకి హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు..పెద్ద వయస్సు వారు, చిన్న పిల్లలూ దూరంగా ఉండటం మేలని చెబితే బాగుంటుందనేది కొందరి సూచన.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X